logo

28న నరసాపురం సంపూర్ణ బంద్‌

నరసాపురం జిల్లాకు నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న పట్టణ సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు అఖిలపక్ష కమిటీ కన్వీనర్‌ నెక్కంటి సుబ్బారావు తెలిపారు. జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ పార్టీలకు అతీతంగా స్థానిక తెలగా కల్యాణ మండపంలో

Published : 27 Jan 2022 06:00 IST

సమావేశమైన అఖిల పక్ష నాయకులు

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం జిల్లాకు నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న పట్టణ సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు అఖిలపక్ష కమిటీ కన్వీనర్‌ నెక్కంటి సుబ్బారావు తెలిపారు. జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ పార్టీలకు అతీతంగా స్థానిక తెలగా కల్యాణ మండపంలో బుధవారం అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం సాధించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ నెల 27న స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు, అధికారులకు వినతిపత్రాలు అందజేయడం, 28న నరసాపురం సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని