కొవిడ్ వేళసంక్షేమనికి ప్రాధాన్యం
కొవిడ్ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. గణంతంత్ర వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏలూరు పోలీసు పరేడ్ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వంద
ఘనంగా గణతంత్ర వేడుకలు
జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తున్న కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, డీఐజీ మోహనరావు
కొవిడ్ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. గణంతంత్ర వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏలూరు పోలీసు పరేడ్ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.పోలీసు కవాతును పరిశీలించారు. జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. జిల్లా జడ్జి భీమారావు, ఎమ్మెల్సీ సాబ్జీ, ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, జేసీలు హిమాన్షు శుక్లా, అంబేడ్కర్, శిక్షణ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - న్యూస్టుడే, ఏలూరు అర్బన్
ఉత్తమ శాఖలకు రోలింగ్ షీల్డ్స్.. వివిధ శాఖల ప్రగతి, పనితీరు ఆధారంగా రోలింగ్ షీల్డ్లను అందజేశారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖలకు ప్రథమ, ద్వితీయ, స్థానాలు లభించాయి. ఏలూరు మండలం శనివారపుపేట, అత్తిలి సచివాలయాలకు రోలింగ్ షీల్డ్లను అందజేశారు. రెవెన్యూ శాఖలో ఉత్తమ అధికారిణిగా ఆర్డీవో పి.రచన, పోలీసు శాఖలో కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావులకు ఉత్తమ అధికారులుగా పురస్కారాలను అందజేశారు. పోలీసు కవాతులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన స్కాట్లాండ్ బ్యాగ్పైపర్ బృందానికి బహుమతి అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లను ప్రదర్శించారు. ఆయా పథకాల లబ్ధిదారులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.
త్యాగధనుల జీవితాలు స్ఫూర్తిదాయకం.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల జీవితాలు స్ఫూర్తిదాయకమని డీఐజీ మోహనరావు అన్నారు. స్థానిక డీఐజీ విడిది కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని డీఐజీ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఏఎస్పీ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ● స్థానిక ఎస్పీ విడిది కార్యాలయంలో ఎస్పీ రాహుల్దేవ్ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. త్యాగధనుల కృషితోనే స్వాతంత్య్రం.. ● ఎంతోమంది త్యాగధనులు చేసిన కృషివల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని జిల్లా జడ్జి భీమారావు అన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని భీమారావు ఎగురవేసి గౌరవ వందనం చేశారు. జిల్లా అదనపు జడ్జి టి.మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వి.శ్రీనివాసులు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ● తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ప్రాంగణంలో డైరెక్టర్ సీఎస్ఫీరావు జెండా ఆవిష్కరించారు.
కవాతు చేస్తున్న పోలీసులు
ప్రగతిని ప్రతిబింబించిన శకటాలు.. జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించేలా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖ, గృహ నిర్మాణ సంస్థ, వ్యవసాయ శాఖలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శర్వాణీ, వెస్ట్ బెర్రీ, కేజీబీవీ పాఠశాలలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాయి.
గిరిజనుల నృత్య ప్రదర్శన
శర్వాణీ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు మొదటి బహుమతి
ప్రథమ స్థానం పొందిన వైద్య, ఆరోగ్య శాఖ శకటం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలిమెట్టు.. అదిరేట్టు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తాచాటారు. -
మధ్యంతర భృతికి మంగళం
[ 23-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. -
ఎన్నికల ఎర.. యువత విలవిల
[ 23-04-2024]
రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 7,900 పోస్టులకు మాత్రమే డీఎసీˆ్స ప్రకటన ఇచ్చింది.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎసీˆ్స పెడతానని చెబుతున్నా.. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. -
వైకాపా మాయలోపడి రాజీనామాలు చెయ్యొద్దు: నిమ్మల
[ 23-04-2024]
వైకాపా మాయలోపడి వాలంటీర్లు రాజీనామాలు చెయొద్దని, తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు రూ.10 వేతనం ఇస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. -
గ్రంధి ఏనాడైనా పవన్లా సేవ చేశారా?
[ 23-04-2024]
ఓటమి తప్పదని తెలిసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మెగా బ్రదర్స్పై ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామమోహనరావు విమర్శించారు -
చితికిలబడింది
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా చతికిలపడింది. పునర్విభజన అనంతరం జిల్లా గత ఏడాది 22వ స్థానంలో నిలవగా.. ఈసారి 25వ స్థానానికి దిగజారింది. విద్యార్థులు 80.08 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 15.73 శాతం పెరగడం చెప్పుకోదగిన విషయం. -
ప్రగల్భాలు తప్ప.. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఏరి?
[ 23-04-2024]
గ్రామీణ ప్రజల ఇళ్ల వద్దే నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్య విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం మాదే.. -
23వ స్థానంలో పశ్చిమ
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది -
సాయం ఎగనామం
[ 23-04-2024]
తెదేపా హయాంలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలతోపాటు చేతి వృత్తుల వారికి 90 శాతం రాయితీపై ఆదరణ పరికరాలిచ్చి దన్నుగా నిలిచారు. -
మీ బిడ్డనన్నావ్.. నిలువునా ముంచేశావ్!
[ 23-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలు నిర్మించుకున్న కొందరు లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. 2018, 2019 సంవత్సరాల్లో వీరు పనులు ప్రారంభించగా బిల్లులన్నీ 2020లో చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ప్రకటించింది. -
అయిదేళ్లుగా ఏటా నష్టమే!
[ 23-04-2024]
2023 డిసెంబరులో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 12,438 హెక్టార్లలో వరి, 214 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. -
అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి -
హామీల వల వేసి.. ముంచేసి
[ 23-04-2024]
నవంబరు21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ బియ్యపుతిప్ప హార్బరు, కార్గోపోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. -
బోరుపైపు నుంచి మంటలు
[ 23-04-2024]
యలమంచిలి రెవెన్యూ పరిధిలోని కొత్తలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరు పైపు నుంచి సోమవారం మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి