ఎన్నెన్నో మార్పులు ..చేర్పులు !
కొత్త జిల్లాల ఏర్పాటుకు రాజపత్రం వెలువడటంతో పశ్చిమలో అనేక నైసర్గిక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండనుండగా, ఏలూరు కొత్త జిల్లాగా అవతరిస్తుంది. గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లనున్నాయి. భీమవరం
కొత్త జిల్లాల ఏర్పాటుకు రాజపత్రం వెలువడటంతో పశ్చిమలో అనేక నైసర్గిక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండనుండగా, ఏలూరు కొత్త జిల్లాగా అవతరిస్తుంది. గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లనున్నాయి. భీమవరం కొత్తగా రెవెన్యూ డివిజన్ కానుండగా, కుక్కునూరు డివిజన్ జంగారెడ్డిగూడెంలో కలిసిపోనుంది. నూజివీడు రెవెన్యూ డివిజన్ ఏలూరు జిల్లాలో కలవనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో చోటు చేసుకోనున్న అంశాలన్నీ ఆసక్తికరంగానే ఉండనున్నాయి. తాడేపల్లిగూడెం, న్యూస్టుడే:
అంతా ఒకే గొడుగు కిందకు..
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: కొత్త జిల్లాల ఏర్పాటుతో జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ స్వరూపం మారనుంది. తొమ్మిది మండలాలతో ఏర్పాటయ్యే ఈ డివిజన్ మెట్ట, ఏజెన్సీ మండలాల సమాహారంగా ఉండనుంది. ఇప్పుడున్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాలతోపాటు కామవరపుకోట, టి.నరసాపురం మండలాలు, నిర్వాసిత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కొత్త డివిజన్లో కలవనున్నాయి. తద్వారా సబ్ కలెక్టర్ కార్యాలయం స్థాయికి ఈ డివిజన్ హోదా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశంలోనే ప్రత్యేకమైన పోలవరం ప్రాజెక్టు ఈ డివిజన్లోనే ఉంది. ప్రాజెక్టుతోపాటు నిర్వాసితులకు ఇక్కడే పునరావాసం కల్పిస్తున్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతం ప్రత్యేకంగా నిలుస్తుంది. పోలవరం నియోజకవర్గం పూర్తిగా రెవెన్యూ డివిజన్ పరిధిలోకే రానుంది. గతంలో ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లో నాలుగు మండలాలు జంగారెడ్డిగూడెం, రెండు కుక్కునూరు, ఒక మండలం ఏలూరు డివిజన్లో ఉండేవి. ఈ ఏడింటిని ఒకే గొడుగు కిందకు తెస్తున్నారు. నాలుగు మండలాలతో ఉన్న చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాలు మాత్రమే ఈ డివిజన్ పరిధిలో ఉండనున్నాయి. మిగిలిన చింతలపూడి, లింగపాలెం నూజివీడు రెవిన్యూ డివిజన్ (కొత్త ఏలూరు జిల్లా) పరిధిలోనికి వెళ్తున్నాయి. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం గ్రేడ్-2 మున్సిపాల్టీ కీలక పట్టణం కానుంది.
ప్రస్తుతం ఉన్న మండలాలు : 5
కొత్తగా చేరేవి : 4
‘చింతల’పూడి..
చింతలపూడి, న్యూస్టుడే: కొత్త జిల్లాల ఏర్పాటుతో చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాలను కృష్ణా జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్లోకి కలపనున్నారు. ఈ రెండు మండలాలకు నూజివీడు 50 కి.మీ పైగా దూరంలో ఉంది. నూజివీడు వెళ్లాలంటే బస్సు సౌకర్యం కూడా సక్రమంగా లేదు. ఇప్పటివరకు ఏలూరు రెవెన్యూ డివిజన్లో ఈ రెండు మండలాలు ఉండేవి. కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని జిల్లా కార్యాలయాలు అక్కడే ఉండటంతో అన్ని పనులు చక్కబెట్టుకునేవారు. ఈ రెండు మండలాల నుంచి ఏలూరుకు నిత్యం బస్సులు ఉంటాయి. నూతన మార్పు దూరాభారంతో పాటు ఆర్థిక భారం కానుంది.
కీలక పట్టణాలన్నీ ఒకే డివిజన్లోకి..
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలు కొవ్వూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. వీటిలో పెనుగొండ, పెనుమంట్రను నరసాపురం డివిజన్లోకి.. తణుకు, అత్తిలి, ఇరగవరంతోపాటు ఇప్పటి వరకు ఏలూరు డివిజన్ పరిధిలో ఉన్న తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు కొత్తగా ఏర్పడబోయే భీమవరం డివిజన్లో కలపనున్నారు. దీంతో ఇప్పటి వరకు పశ్చిమలో కీలకంగా ఉన్న ఆక్వా జోన్ భీమవరం, పారిశ్రామిక పట్టణం తణుకు, వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెం ఒకే డివిజన్ పరిధిలోకి రానున్నాయి. పుణ్యక్షేత్రాలైన పెనుగొండ, పాలకొల్లు, గునుపూడి పశ్చిమలోనే ఉంటాయి. కొత్త ప్రతిపాదనతో నరసాపురం రెవెన్యూ డివిజన్లో నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలు ఉంటాయి. భీమవరం రెవెన్యూ డివిజన్లో భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఉండనున్నాయి.
అన్నీ ఆసక్తికరమే..
●కొల్లేరు ప్రాంతమంతా పూర్తిగా ఏలూరు జిల్లా పరిధిలోనికి వచ్చేయనుంది. ఇంతకుముందు కొంత భాగం కృష్ణా జిల్లాలోనూ ఉండేది. ● ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం భీమవరానికి 17 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఏలూరు జిల్లాలోకి వెళ్లిపోయింది. ● కొయ్యలగూడెం మండల కేంద్రం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లాలంటే దాదాపు 40 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది. మార్పు జరిగితే 4 కి.మీ. దూరంలోనే రాజమహేంద్రవరం జిల్లాలోని గోపాలపురం మండలం మొదలవుతోంది. ● పోలవరం నుంచి కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురం వచ్చే రహదారిలో దొండపూడి, సాగిపాడు అనే గ్రామాలు తగులుతాయి. ఈ రెండు గ్రామాలు.. రాజమండ్రి జిల్లాలో కలుస్తాయి. ● నూతనంగా ఏర్పడే ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం కీలక పట్టణంగా మారనుంది. మన్యం గ్రామాలకు ముఖద్వారం కావడంతోపాటు, నిర్వాసిత గ్రామాలన్నీ దీని పరిధిలోకే వస్తాయి. ● పోలవరం ప్రాజెక్టుతోపాటు, మధ్య తరహా ప్రాజెక్టులైన ఎర్రకాలువ, కొవ్వాడ, జల్లేలు, జలాశయాలు ఏలూరు జిల్లా పరిధిలోనికి రానున్నాయి.
ద్వారకాతిరుమల తూర్పులోకి..
చాగల్లు, కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే: తాజా పరిణామాలతో కొవ్వూరు డివిజన్ పరిధిలోని మండలాల కూర్పులో మార్పులు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, రాజమహేంద్రవరం అర్బన్, గ్రామీణ, అనపర్తి, రాజానగరం ఉన్నాయి. ఈ స్వరూపంలో మార్పు లేనప్పటికీ ఇప్పటి వరకూ కొవ్వూరు డివిజన్లో ఉన్న అత్తిలి, పెనుమంట్ర, ఇరగవరం, పెనుగొండ, తణుకు మండలాలు నరసాపురం జిల్లాలో కలిసిపోనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కానున్న రాజమహేంద్రవరానికి కొవ్వూరు 8 కి.మీ.దూరంలో అతి చేరువలో ఉండగా ద్వారకాతిరుమల నుంచి జిల్లా కేంద్రానికి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి
[ 25-04-2024]
ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ ను దాఖలు చేశారు. -
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్