కుక్కునూరు డివిజన్కు మంగళం
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జిల్లాలో కుక్కునూరు రెవెన్యూ డివిజన్ తెరమరుగు కానుంది. రెండు మండలాలు, 47 రెవెన్యూ గ్రామాలతో ఏర్పడిన ఈ గిరిజన ప్రాంత డివిజన్ను జంగారెడ్డిగూడెంలో విలీనం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్లలో స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు ముందువరకు తెలంగాణలోని ఖ
ముగిసిన ఏడేళ్ల ప్రస్థానం
కుక్కునూరు, న్యూస్టుడే: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో జిల్లాలో కుక్కునూరు రెవెన్యూ డివిజన్ తెరమరుగు కానుంది. రెండు మండలాలు, 47 రెవెన్యూ గ్రామాలతో ఏర్పడిన ఈ గిరిజన ప్రాంత డివిజన్ను జంగారెడ్డిగూడెంలో విలీనం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్లలో స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనకు ముందువరకు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతాన్ని విభజనలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేశారు. పోలవరం ముంపు ప్రాంతంగా ఉన్న ఈ డివిజన్, ప్రాజెక్టు నిర్మాణంలో కీలకం కావటంతో ఈ ప్రాంతాన్ని ఏపీకి కేటాయిస్తూ 2014లో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీ చేసింది. తొలుత జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు జారీ కాగా, ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం ఏలూరుకు, డివిజన్ కేంద్రం జంగారెడ్డిగూడేనికి సమీపంలో లేకపోవటంతో ఇక్కడ ప్రజానీకం అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త డివిజన్గా రాజపత్రం జారీ అయింది. కుక్కునూరు, వేలేరుపాడు పూర్వపు మండలాలతో పాటు, బూర్గంపాడు మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాలతో ఈ డివిజన్ రూపాంతరం చెందింది. దాదాపు 300 చ.కి.మీ. వైశాల్యంతో, 47 రెవెన్యూ గ్రామాలతో కొనసాగుతున్న ఈ డివిజన్ ఈ ఉగాది నాటికి జంగారెడ్డిగూడెం డివిజన్లో విలీనం కానుంది.
సదుపాయాలు లేక..
రెవెన్యూ డివిజన్ అన్న పేరే తప్ప, ఎప్పుడూ ఆ స్థాయిలో ఈ కేంద్రం కొనసాగిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉపకలెక్టర్లుగా ఐఏఎస్ స్థాయి అధికారులను నియమించటం, వారు నివాసం ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవటంతో వారు డివిజన్ ప్రధాన కేంద్రాన్నే మార్చేశారు. ఐటీడీఏ ఉన్న కె.ఆర్.పురాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసుకుని పాలన జరిపారు. తొలుత సాగిలి షన్మోహన్ ఉపకలెక్టర్గా వచ్చారు. కొద్ది నెలలు ఆయన ఇక్కడ నుంచే డివిజన్ కార్యకలాపాలు కొనసాగించారు. ఆయనకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా కూడా అదనపు బాధ్యతలు ఉండటం, అక్కడ అధికార నివాసం, ఇతరత్రా సౌకర్యాలు ఉండటంతో ఈ కార్యాలయ పాలనను అక్కడ నుంచే కొనసాగించటం ఆరంభించారు. కొద్దిరోజులు తర్వాత కార్యాలయం పూర్తిగా ఐటీడీఏ కు మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన అధికారులు కూడా ఇదే తరహాలో డివిజన్ కార్యకలాపాలు కొనసాగించారు. ఇక్కడ కార్యాలయం ఉన్నా అందులో ఒక ఉద్యోగి మాత్రమే ఉండేవారు. రాజకీయ పార్టీలు సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సమయంలో వినతి పత్రం సీ్వీకరించేందుకు ఆ అధికారి ఉపయోగపడేవారు. డివిజన్ అన్న సంతోషం కొన్ని నెలలుగా ఈ ప్రాంత ప్రజలు అనుభవించలేకపోయారు.
ముంపు పేరిట..
రెవెన్యూ డివిజన్ అయిన తొలి రోజుల్లో ఈ ప్రాంతం రూపురేఖలు మార్చేస్తామని నాయకులు ప్రకటించారు. హుటాహుటిన ఆర్డీవో కార్యాలయం, మినీ ఐటీడీఏ, అతిథి గృహాలను మంజూరుచేశారు. వీటిలో కోసం రూ.60 లక్షలు కేటాయిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఇంతలో జిల్లా యంత్రాంగానికి పోలవరం ముంపు గుర్తుకొచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దుచేశారు. దీంతో ఇక్కడ తగిన వసతులు సమకూరక ఐటీడీఏకు డివిజన్ కేంద్రాన్ని మార్చాల్సిన దుస్థితి తలెత్తింది. దాదాపు ఏడేళ్లపాటు నిర్జీవంగా కొనసాగిన ఈ డివిజన్ మరో రెండు నెలల్లో తన అస్థిత్వాన్ని పూర్తిగా కోల్పోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి