logo

వేగంగా కారు నడిపి.. ఒకరిని ఢీకొట్టి..

జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్ర కళాశాల కూడలిలో గురువారం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ విద్యార్థిని కారు ఢీకొట్టింది. తేజ అనే విద్యార్థి గాయపడ్డారు. ఇంటర్మీడియట్‌ ప్రధాన పరీక్షలు పూర్తికావడంతో ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు గురువారం

Published : 20 May 2022 06:03 IST

పరీక్షల ఆఖరిరోజు విద్యార్థుల హల్‌చల్‌

 జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్ర కళాశాల కూడలిలో గురువారం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ విద్యార్థిని కారు ఢీకొట్టింది. తేజ అనే విద్యార్థి గాయపడ్డారు. ఇంటర్మీడియట్‌ ప్రధాన పరీక్షలు పూర్తికావడంతో ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు గురువారం మధ్యాహ్నం కారులో షికారు చేశారు. కారును వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ప్రమాదానికి కారణమైన విద్యార్థులు కొందరు మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు. కారును సమీపంలోని తుప్పల్లోకి నెట్టుకెళ్లి ఎవరికీ కనిపించకుండా దాచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ద్విచక్ర వాహన దారుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని