బరి తెగింపు
తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆరుగొలను, కొత్తూరు గ్రామాల్లో తవ్వకాలను నిలిపివేయడంతో అక్రమార్కులు ఇతర గ్రామాల్లోని పంట పొలాలు, చెరువులపై పడ్డారు. అడ్డ దారిలో తవ్వకాలు
ఓ నేత అండతో కొనసాగుతున్న మట్టి దందా
జగ్గన్నపేటలో మాలపాడు చెరువును తవ్వుతున్న వైనం
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే : తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆరుగొలను, కొత్తూరు గ్రామాల్లో తవ్వకాలను నిలిపివేయడంతో అక్రమార్కులు ఇతర గ్రామాల్లోని పంట పొలాలు, చెరువులపై పడ్డారు. అడ్డ దారిలో తవ్వకాలు చేస్తూ వందల కొద్దీ లారీల్లో మట్టి తరలిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. తవ్వకాలు జరపవద్దని అధికారులు మొరపెట్టుకుంటున్నా అక్రమార్కులు వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. ఒక చోట తవ్వకాలను అడ్డుకుంటే మరొక చోట ప్రారంభిస్తున్నారు. వారిని అదుపు చేయడంలో రెవెన్యూ అధికారులు విఫలం చెందుతున్నారు. అధికార పార్టీలోని ఓ కీలక నేత సహకారంతోనే మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఆయన ఫోన్ చేశారని.. వెనుతిరిగారు.. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో 6.90 ఎకరాల విస్తీర్ణంలో మాలపాడు చెరువు ఉంది. ఇందులో విలువైన గ్రావెల్ ఉండటంతో మట్టి మాఫియా కన్ను పడింది. దీంతో చెరువులోని మట్టిని గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించేందుకు తీర్మానం తీసుకున్నారు. దొరికిందే తడవుగా పదుల సంఖ్యలో లారీలు, జేసీబీలను తీసుకొచ్చి మైనింగ్ అనుమతులు లేకుండా తవ్వకాలు నిర్వహించారు. తీర్మానం ప్రకారం చెరువులోని మట్టిని గ్రామాభివృద్ధికి వాడకుండా తాడేపల్లిగూడెం పట్టణంలో పలు మట్టి రోడ్లు వేసేందుకు ఉపయోగించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన తవ్వకాల్లో తట్ట మట్టినీ గ్రామంలో వేయకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న విజిలెన్సు అధికారులు మాలపాడు చెరువులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న లారీలు, జేసీబీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ లోగా అధికార పార్టీకి చెందిన ఓ నేత సంబంధిత అధికారులకు ఫోన్ చేయడంతో ఎక్కడి వాహనాలను అక్కడే వదిలేసి విజిలెన్స్ అధికారులు తిరుగుముఖం పట్టారు.
కొండ్రుప్రోలులో తవ్వకాలు
తవ్వకాలను అడ్డుకుంటాం
ఆరుగొలను, కొత్తూరు గ్రామాల్లో గ్రావెల్ తవ్వకాలను పూర్తిస్థాయిలో నిలిపివేశాం. అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం రాగానే ఘటన స్థలానికి చేరుకుని వాటిని అడ్డుకుంటున్నాం. అక్రమ తవ్వకాలు నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం. - అప్పారావు, తహశీల్దార్
అక్కడ ఆగింది.. ఇక్కడ మొదలైంది..
జగ్గన్నపేట మాలపాడు చెరువులో విజిలెన్స్ దాడులు జరిగి ఒక్కరోజు కాకముందే కొండ్రుప్రోలు గ్రామంలోని పంట పొలాల్లో అక్రమార్కులు తవ్వకాలు చేపట్టారు. పట్టపగలే తవ్వకాలు చేపట్టడం గమనార్హం. గ్రామస్థాయి అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గూడెం మండలంలో మట్టి తవ్వకాలను పూర్తిస్థాయిలో నిలిపి వేయాలని ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. అధికార పార్టీ అండ చూసుకుని మట్టి మాఫియా చేస్తున్న అక్రమాలకు అధికారులు బలవుతున్నారు. ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా వారు నలిగిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్