తట్ట మట్టేస్తే ఒట్టు!
తమ చిరకాల వాంఛ నెరవేరనుందని డెల్టా ప్రాంత వాసులు ఆశపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు కొందరు స్వచ్ఛందంగా ముందుకు రాగా మరికొందరు అయిష్టంగానే అంగీకరించారు. అనంతరం అధికారులు
ఏడాది కావొస్తున్నా అడుగు ముందుకు పడని వైద్య కళాశాల పనులు
దగ్గులూరులో వైద్య కళాశాల కోసం సేకరించిన భూమి
జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైంది. తొలుత నరసాపురంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే ఉభయ గోదావరి జిల్లాల వారికి అందుబాటులో ఉంటుందనే వాదన వినిపించింది. నరసాపురంతో పాటు రాజకీయ ప్రాధాన్యం ఉన్న తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో కళాశాల ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన కూడా చేశారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే విద్యా రంగానికి చెందిన పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వాటితో పోల్చితే వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన పాలకొల్లు విద్య, వైద్య రంగంలో వెనుకబడి ఉంది. ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావించింది. అనంతరం 216 జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పాలకొల్లు గ్రామీణ మండలం దగ్గులూరు-లంకలకోడేరు గ్రామాల మధ్య ఏర్పాటుకు అధికారులు భూసేకరణ చేశారు. మొత్తం 60 ఎకరాలు అవసరం కాగా 63 మంది రైతుల నుంచి సేకరించారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో కర్షకులు సైతం ముందుకు వచ్చి ఎకరా రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు. కానీ సేకరించిన భూమిలో ఇప్పటి వరకు చిన్నపాటి నిర్మాణం చేపట్టలేదు.
భూసేకరణ వరకే మా బాధ్యత.. ‘భూమిని సేకరించి ఇవ్వడం వరకే మా బాధ్యత. ఆ తరువాత వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి వెళుతుంది’ అని పాలకొల్లు తహశీల్దార్ జి.మమ్మి తెలిపారు.
నిధులు మంజూరు కావాలి
‘కళాశాల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తయ్యింది. పనులు ప్రారంభించేందుకు నిధులు విడుదల కావాల్సి ఉంది’ అని వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ డీఈ ఎం.శ్రీనివాసరెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు