logo

తెదేపాతోనే బీసీలకు గుర్తింపు

పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు గుర్తింపు ఇచ్చిందని తెదేపాయేనని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తెదేపా నియోజకవర్గ బీసీ సెల్‌ సమావేశం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ ముఖ్యఅతిథిగా

Published : 26 May 2022 03:50 IST

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే రామానాయుడు

పాలకొల్లు,న్యూస్‌టుడే: పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు గుర్తింపు ఇచ్చిందని తెదేపాయేనని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తెదేపా నియోజకవర్గ బీసీ సెల్‌ సమావేశం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వార్డు సభ్యునిగా, ఎంపీపీగా, రెండు సార్లు జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన ఘనత తెదేపాదని చెప్పారు. మహానాడుకు బీసీలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కడలి గోపాలరావు, కోడి విజయభాస్కర్‌, మామిడిశెట్టి పెద్దిరాజు, పెశ్చెటి వెంకటేశ్వరరావు, కుక్కల సత్యనారాయణ, పాలవలస తులసీరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని