ట్రాఫిక్లో ఇరుక్కున్న మాజీ ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి బుధవారం రాత్రి జంగారెడ్డిగూడెం - కొయ్యలగూడెం రహదారిలో ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్టి గురునాధరావు కుమారుడి వివాహ వేడుకలకు
2:30 గంటలపాటు ట్రాఫిక్లోనే ఉన్న కిరణ్కుమార్రెడ్డి
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి బుధవారం రాత్రి జంగారెడ్డిగూడెం - కొయ్యలగూడెం రహదారిలో ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్టి గురునాధరావు కుమారుడి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు జంగారెడ్డిగూడెం వెళ్తూ రాత్రి 9 నుంచి 11:30 గంటల వరకు ఈయన వాహనం ట్రాఫిక్లో ఉండిపోయింది. మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఉందని తెలిసినా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోలేదు. లారీలు, బస్సులు, కార్లు, ఇతర వాహనాలు రెండు మూడు వరుసలుగా ఆగిపోయాయి. ద్విచక్ర వాహనదారులు ప్రయాణించే వీలు లేనంతగా నిలిచిపోయాయి.
నేతలతో మాటా మంతీ..
అంతకముందు కిరణ్కుమార్ రెడ్డి జంగారెడ్డిగూడెం రాజులకాలనీలోని ఒక అతిథి గృహంలో బసచేశారు. అక్కడ కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులతో ముచ్చటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!