స్వచ్ఛ జలం.. ఎంతో దూరం
పాలకోడేరు మండలంలో రేలంగి ఉత్తర, దక్షిణ పంట కాలువలకు శివారున మోగల్లు గ్రామం ఉంది. కాలువల్లో ఎగువ నుంచి కొట్టుకు వచ్చే వ్యర్థాలతో పాటు ఆక్వా సాగు ప్రభావంతో గ్రామంలో చెరువు జలాలు కలుషితమవుతున్నాయి. ఈ గ్రామ జనాభా సుమారు 11 వేలు. 1150 కుళాయి
బేతపూడి చెరువులో రుంగు మారిన నీరు
పాలకోడేరు మండలంలో రేలంగి ఉత్తర, దక్షిణ పంట కాలువలకు శివారున మోగల్లు గ్రామం ఉంది. కాలువల్లో ఎగువ నుంచి కొట్టుకు వచ్చే వ్యర్థాలతో పాటు ఆక్వా సాగు ప్రభావంతో గ్రామంలో చెరువు జలాలు కలుషితమవుతున్నాయి. ఈ గ్రామ జనాభా సుమారు 11 వేలు. 1150 కుళాయి కనెక్షన్లు ఉండగా వాటి ద్వారా సరఫరా చేసే నీటిని ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తాగునీటి కోసం ప్రైవేటు ఆర్వో ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
భీమవరం మండలం శివారు గ్రామాల్లో ఎల్వీఎన్ పురం ఒకటి. ఇక్కడి ఓవర్హెడ్ ట్యాంకు శిథిలం కావడంతో కొద్ది రోజుల కిందట కూల్చివేశారు. అప్పటి నుంచి నేరుగా కాలువ నీటినే కుళాయిల సరఫరా చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఫిల్టర్బెడ్లో శుద్ధి చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ నీళ్లు తాగేందుకు అనువుగా లేకపోవడంతో ప్రజలు తాగునీటి కొనుగోలు చేస్తున్నారు.
భీమవరం గ్రామీణ, పెనుమంట్ర, న్యూస్టుడే : చుట్టూ జలాలతో కళకళలాడే పంట కాలువలు, రక్షిత మంచి నీటి పథకాలు ఉన్నా కొన్ని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కుళాయి ద్వారా సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో స్థానికులు ప్రైవేటు ట్యాంకర్లు, ఆర్వో ప్లాంట్లపై ఆధారపడుతున్నారు.
ఇదీ పరిస్థితి.. వేసవి వేళ చెరువులను నింపడంపైనే దృష్టి పెడుతున్న యంత్రాంగం జలాల శుద్ధిపై మాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల ఫిల్టర్బెడ్లకు మరమ్మతులు చేయకపోవడం. ఓవర్హెడ్ ట్యాంకులను నెలల తరబడి చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భీమవరం, ఆకివీడు, కాళ్ల, మొగల్తూరు, నరసాపురం, వీరవాసరం, పాలకోడేరు, పెనుమంట్ర, అత్తిలి, పాలకొల్లు, పోడూరు, ఆచంట, పెనుగొండ తదితర డెల్టా మండలాల్లో చాలా చోట్ల చెరువుల్లో నీరు తరచూ రంగు మారుతోంది. పంట కాలువల్లోకి ఆక్వా చెరువుల వ్యర్థాలను వదిలేయడమే దీనికి కారణమని అధికారులు చెబుతుంటారు. దీనికి నిర్వహణ లోపాలు తోడవుతున్నాయి. చెరువులు, రక్షిత నీటి పథకాలు, ఓవర్హెడ్ ట్యాంకుల నిర్వహణకు జల్జీవన్ మిషన్ నిధులు సిద్ధంగా ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
పైపుల చెరువు వద్ద నీటి కోసం పాలకోడేరు మండల వాసుల నిరీక్షణ
పాలకోడేరు, మోగల్లు, విస్సాకోడేరు, పెన్నాడఅగ్రహారం, శృంగవృక్షం, కొండేపూడి, మైప గ్రామాల్లో కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరు అపరిశుభ్రంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామాల్లో అధికశాతం మంది ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి తాగునీటిని డబ్బాలతో తెచ్చుకుంటున్నారు. ● గుత్తులవారిపాలెం, వేండ్ర, వేండ్రఅగ్రహారం, మోగల్లు, పాలకోడేరు, విస్సాకోడేరు గ్రామాల ప్రజలకు సుమారు 4 కి.మీ దూరంలోని భీమవరం పైపుల చెరువు ప్రాంతంలో రక్షిత పథకం నుంచి వచ్చే నీటిని, ప్రధాన పైపులైను వాల్వుల నుంచి వచ్చే లీకేజీ నీటిని జాగ్రత్తగా పట్టుకుని తెచ్చుకుంటున్నారు. ‘స్వచ్ఛమైన తాగునీరు అందని చోట్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.’అని గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా అధికారి రామస్వామి తెలిపారు.
8 కిలోమీటర్లు వెళ్లి వస్తున్నాం
మోగల్లు పంచాయతీ పరిధి గుత్తులవారిపాలెంలో కుళాయిలకు బోరు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగితే కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దీంతో పైపుల చెరువు ప్రాంతంలో ఉన్న భీమవరం పురపాలక రక్షిత పథకం నుంచి తెచ్చుకుంటున్నాం. నిత్యం ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. - జి.రామకృష్ణ, గుత్తులవారిపాలెం●
జిల్లాలో పంచాయతీ మంచి నీటి చెరువులు 274
భారీ రక్షిత మంచి నీటి పథకాలు 23
శుద్ధి చేసిన తాగునీరు అందని గ్రామాలు 88
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?