పిల్లలకు ట్రాఫిక్ పాఠం మరిచారు!
రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్తోపాటు భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు,
నిరుపయోగంగా పార్కులు
తణుకులో చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కు
తణుకు, న్యూస్టుడే : రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్తోపాటు భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం పట్టణాల్లో ఒక్కో పార్కునకు రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు మున్సిపల్ నిధులు వెచ్చించి వీటిని అభివృద్ధి చేశారు. వీటిలో వాహనాలు ఏ విధంగా నడపాలి, పాఠశాలలు, వంతెనలు, ఆసుపత్రులు, కూడళ్లు ఉన్న ప్రదేశంలో ఏ గుర్తులు ఉంటాయి, వాటిని ఏ విధంగా గుర్తించాలనే అంశాలపై ప్రారంభంలో శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా వేసవి సెలవుల్లో ఎక్కువగా వీటిని ఉపయోగించేవారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు పాఠశాలలు ముగిసిన అనంతరం, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల సహకారంతో అవగాహన కల్పించారు. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు పట్టించుకోక అన్ని చోట్లా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
అందరికీ అర్థమయ్యేలా..
అందరికీ అర్థమయ్యే విధంగా పార్కుల్లో వాహనాలు నిలిపే ప్రదేశంలో వాహనాలు నిలపడానికని, వాహనం ఎడమవైపునకు తిరగడానికి, కుడి వైపు తిరగడానికి, రహదారి ఎత్తు పల్లాలుగా ఉందని సూచించే విధంగా ట్రాఫిక్ బోర్డులు ఏర్పాటు చేశారు. రేడియం స్టికర్లు, వివిధ రకాల ట్రాఫిక్ గుర్తులను తెలిపే బోర్డులు పెట్టారు. వీటి ప్రదర్శన ద్వారా పిల్లలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రాథమిక స్థాయి నుంచి వారానికి ఒక పాఠశాల చొప్పున విద్యార్థులను పార్కులకు తీసుకొచ్చి వివరించాల్సి ఉంది. కాని ఎక్కడా అలా జరగడం లేదు. దీంతో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సామగ్రి శిథిలస్థితికి చేరుతున్నాయి.
పార్కు లోపల ఇలా...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు