ఉద్యమాల గడ్డపై.. త్యాగధనుల స్మృతిలో..!
ఉద్యమాల గడ్డగా పేరొందిన భీమవరంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో జులై 4వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల జీవిత చరిత్రలు, త్యాగాలను తెలియజెప్పేలా
నేటి నుంచి భీమవరంలో అల్లూరి జయంతి వారోత్సవాలు
భీమవరం పట్టణం, న్యూస్టుడే
సీతారామరాజు విగ్రహం ఏర్పాటుచేయనున్న ఏఎస్ఆర్ పార్కు
ఉద్యమాల గడ్డగా పేరొందిన భీమవరంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో జులై 4వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల జీవిత చరిత్రలు, త్యాగాలను తెలియజెప్పేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అల్లూరి సీతారామరాజు కుటుంబం నివసించిన పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో వేడుకలను ప్రారంభిస్తారు.
* తొలిరోజు పట్టణంలోని డాక్టర్ బీవీరాజు మార్గ్లో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 1000 మందితో భారీ ప్రదర్శన చేపట్టేలా విద్యా శాఖ అధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాల ప్రాంగణంలో రోజూ సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలాపన కార్యక్రమాలు ఉంటాయని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.వెంకటరమణ చెప్పారు.
* 29న 125 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ఊరేగింపు, 30న సైకిల్ యాత్ర నిర్వహిస్తారు.
ఎందరో మహనీయులు
స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆంగ్లేయుల తుపాకీ గుళ్లకు బలైన భరతమాత ముద్దుబిడ్డలను భీమవరం పట్టణం కళ్లారా చూసింది. అలనాడు మహాత్మా గాంధీ పిలుపు మేరకు భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన ఉద్యమకారులంతా ఒకేచోటకు చేరుకునేవారు. ఉద్యమం ఎలా సాగాలో, నాయకత్వం వహించేవారి మాట జవదాటకుండా ఎలా నడుచుకోవాలో ముందుగానే నిర్ణయించుకునేవారు. పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు కోసం కాకుండా స్వాతంత్య్ర సాధననే లక్ష్యంగా ఉద్యమించిన వారు ఎందరో ఉన్నారు.
పిన్న వయసులోనే..
1942 ఆగస్టులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భీమవరంలో పెద్ద ఎత్తున నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. మహాత్ముని పిలుపు మేరకు పట్టణానికి చెందిన డాక్టర్ సుభద్రాదేవి తల్లిదండ్రులు ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. అదే సమయంలో సుభద్రాదేవి భీమవరం కోర్టు ఆవరణలోకి వెళ్లి ఉద్యోగాలు వదిలి ఉద్యమంలోకి రావాలంటూ మేజిస్ట్రేటు ఎదుట బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో ఆమె రెండేళ్ల కారాగార శిక్షకు గురయ్యారు. రాయవెల్లూరులోని మహిళా కారాగారానికి తీసుకెళ్లారు. ఆ జైలులో ఉన్న వారిలో అతిపిన్నవయస్కురాలు కావడంతో అప్పటి మద్రాసు గవర్నరు ఆమె శిక్షను తగ్గించి మూడు నెలల తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులోనూ ఆమె సేవలను కొనసాగిస్తున్నారు.
రెండో బార్డోలిగా.. పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న వారిలో అత్యధికులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారే. ఆ ఉద్యమాన్ని గుజరాత్లోని బార్డోలిలో మహాత్మాగాంధీ ప్రారంభించారు. వెనువెంటనే ఇక్కడి నాయకులు ఆ ఉద్యమాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించడంతో భీమవరాన్ని రెండో బార్డోలి అని మహాత్ముడు కొనియాడారు.
* 1942 ఆగస్టు 17న భీమవరం తాలూకాఫీసు ప్రాంగణం క్విట్ఇండియా సమావేశానికి వేదికైంది. ఉద్యమ నాయకులు భూపతిరాజు సుబ్బతాతరాజు, కాంగ్రెస్ కార్యదర్శి గొట్టుముక్కల రామచంద్రరాజు, ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో భీమవరం మండలం చినఅమిరం గ్రామానికి చెందిన బలరామరాజు అమరుడయ్యారు. వేమూరి హనుమంతరావు, తనికెళ్ల చలపతి, డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణశర్మ, ముష్ఠి సుబ్రహ్మణ్యం, తటవర్తి కృష్ణమూర్తి ఉద్యమంలో పాల్గొన్నారు.
విప్లవ జ్యోతి.. సాయుధ పోరాటంతోనే స్వాతంత్య్ర సాధ్యమని నమ్మిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బాల్యంలో ఆయన కుటుంబం పాలకోడేరు మండలం మోగల్లులో నివసించింది. నరసాపురం, భీమవరం మండలంలోని కొవ్వాడ అన్నవరం గ్రామాల్లోనూ కొద్ది రోజులు ఉన్నారు.
శాసనోల్లంఘన ఉద్యమంలో..
శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా 1932 జూన్ 27న భీమవరంలో సమావేశాన్ని పసల కృష్ణమూర్తి అధ్యక్షతన జరపాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసి ఉద్యమకారులు పోలీసులు అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అంజిలక్ష్మి, కాళీపట్నం కొండయ్య, గారపాటి సత్యనారాయణ, ఉద్దరాజు మాణిక్యాంబ, పసల కృష్ణమూర్తి తదితర యోధులు చేలగట్లు వెంబడి భీమవరం చేరుకున్నారు. తాలూకాఫీసు భవనం పైకి ఎక్కి త్రివర్ణ పతాకం ఎగురవేశారు. వందేమాతరం అంటూ నినదిస్తూ గాంధీజీకి జైకొట్టారు. ఆరు నెలల గర్భిణిగా ఉన్న అంజిలక్ష్మి కూడా జెండా ఎగురవేసి కారాగార శిక్షకు గురయ్యారు. జైలులోనే ఆమె కుమార్తెకు జన్మనివ్వగా కృష్ణభారతిగా నామకరణం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామయ్య సన్నిధిలో.. రామ రాజుల పలకరింపు
[ 18-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వం విషయంలో పోటీ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురై ఆప్యాయంగా పలకరించుకున్న ఘటన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. -
శిబిరాలే.. చికిత్సల్లేవ్
[ 18-04-2024]
తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి. -
ఉద్ధృతంగా ఏలూరు కాలువ
[ 18-04-2024]
ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఏలూరు కాలువ గట్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
వైకాపా అభ్యర్థిపై సా...గుతున్న విచారణ
[ 18-04-2024]
పాలకొల్లు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి గూడాల శ్రీహరిగోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ప్రచారంలో పలు ప్రాంతాల్లో మహిళలకు నగదు, కానుకలు అందజేశారు -
ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్పై కేసు
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. -
ఇక నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
సమరమే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏలూరు పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు -
జగన్... నిన్ను నమ్ముకుంటే కొంప కొల్లేరు
[ 18-04-2024]
‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణకు చర్యలు చేపడతాం. ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర యుద్ధ ప్రాతిపదికన రెగ్యులేటర్లు నిర్మించి కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’ -
ఇంకెంతన్నారు.. వేతనానికే దిక్కు లేదు
[ 18-04-2024]
వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ : కలెక్టర్
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. -
కుల బహిష్కరణ చేశారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
[ 18-04-2024]
సంఘం పెద్దలను నిలదీసినందుకు తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సొంతిల్లన్నారు.. నట్టేట ముంచారు
[ 18-04-2024]
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది. -
ముహూర్తాలతో సమరానికి సై
[ 18-04-2024]
జిల్లాలో రాజకీయం వేడెక్కనుంది. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో పూర్తిస్థాయి ఎన్నికల సందడి మొదలవనుంది.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్