విద్యా శాఖదే ఇక పూర్తి పర్యవేక్షణ!
పురపాలక పాఠశాలలు అన్నింటినీ ప్రభుత్వం విద్యాశాఖ ఆధీనంలోకి బదిలీ చేసింది. వీటిపై పర్యవేక్షణ, అజమాయిషీ, పాలన వ్యవహారాలను ఇక నుంచి పాఠశాల విద్యాశాఖ చూస్తుంది. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఉన్న విధానాలనే వీటిలోనూ అమలు చేయనున్నారు. అయితే ఆస్తులు స్థానిక సంస్థల ఆధీనంలోనే ఉంటాయని పేర్కొంది. జిల్లాలోని
నరసాపురం, భీమవరం పట్టణం, న్యూస్టుడే
నరసాపురంలో ఎస్ఎన్ఎస్ పురపాలక ఉన్నత పాఠశాల
పురపాలక పాఠశాలలు అన్నింటినీ ప్రభుత్వం విద్యాశాఖ ఆధీనంలోకి బదిలీ చేసింది. వీటిపై పర్యవేక్షణ, అజమాయిషీ, పాలన వ్యవహారాలను ఇక నుంచి పాఠశాల విద్యాశాఖ చూస్తుంది. జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఉన్న విధానాలనే వీటిలోనూ అమలు చేయనున్నారు. అయితే ఆస్తులు స్థానిక సంస్థల ఆధీనంలోనే ఉంటాయని పేర్కొంది. జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలకాల్లోని 149 పాఠశాలలు విద్యాశాఖ పరిధిలో చేరాయి. వీటిలో 23 ఉన్నత, 9 ప్రాథమికోన్నత, 117 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ జీవో విడుదల చేసింది. ఈ మున్సిపాలిటీలు ఏర్పాటైన నాటి నుంచి ఈ అయిదు పట్టణాల్లో పాఠశాల నిర్వహణ, బోధన పర్యవేక్షణ పురపాలక అధికారులే చూసుకున్నారు.ఇప్పటి వరకు ఈ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాలు, పదో తరగతి వారికి అధ్యయన సామగ్రి అందించడం, పలు సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ నుంచి నిధులు హెచ్చించేవారు. విద్యాశాఖ ఆధీనంలోకి వెళ్లడంతో ఇకపై మున్సిపాలిటీ పెత్తనం ఉండదు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి, ఆంగ్ల మాధ్యమం అమలు, ఇతర అంశాల్లో మెరుగు కోసమే విద్యాశాఖలో విలీనం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
*మున్సిపాలిటీల్లో జనాభా ఆధారంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలోని స్థిరాస్తుల విలువ రూ. వందల కోట్లు ఉంటుందని అంచనా. ఈ ప్రక్రియను కొందరు వ్యతిరేకిస్తున్నప్పటికీ, అధికార పార్టీ కౌన్సిలర్లు, పాలక పెద్దల ఆదేశాలు పాటిస్తున్నారు.
జిల్లాలో 149 పురపాలక పాఠశాలల అప్పగింత
స్పష్టత అవసరం... విద్యాశాఖలో మున్సిపల్ పాఠశాలల విలీనాన్ని సిబ్బంది స్వాగతిస్తున్నారు. గతంలో పదో తరగతి పరీక్షల సన్నద్ధతకు పురపాలక అధికారులు ఒక రకమైన ప్రణాళిక, విద్యాశాఖ మరో ప్రణాళిక ఇచ్చేది. ఇలా అన్ని అంశాల్లో పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలపై షెడ్యూల్ వేర్వేరుగా ఉండేది. ఉపాధ్యాయులు సైతం గందగోళానికి గురయ్యేవారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇతర అంశాలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో ఒక రకంగా, విద్యాశాఖ పరిధిలో మరోలా ఉండేవి. మరోవైపు విలీనం వల్ల పురపాలక అధికారుల పర్యవేక్షణ తగ్గడం, పారిశుద్ధ్య, వాచ్మేన్ల నియామకం, వారి పనితీరుపై పెత్తనం తగ్గుతాయని, సమస్యలు పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పర్యవేక్షణ కష్టతరం: ఉపాధ్యాయుల నియామకం 2000కు ముందు పురపాలక సంస్థల ఆధ్వర్యంలో జరగగా, అనంతరం జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నియామకాలు చేస్తోంది. వీరికి కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల వలే 010 పద్దు నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు.
* సిబ్బంది సర్వీసు నిబంధనలను సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా