అడుగడుగునా అవరోధాలు!
ముందస్తు సాగుకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. కాలువలకు నీళ్లు వదిలి 17 రోజులు కావస్తున్నా ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ ప్రకటనలు, అధికారుల మాటలు విని నారుమళ్లు పోసిన అన్నదాతలు నీళ్ల కోసం కాలువల వద్ద పడిగాపులు కాస్తున్నారు.ప్రస్తుత ఖరీఫ్లో ముందస్తు సాగు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మునుపెన్నడూ లేని విధంగా కాలువలకు ముందుగానే సాగునీరు
17 రోజులైనా కానరాని కృష్ణమ్మ పరవళ్లు
కొనసాగుతున్న కాలువ మరమ్మతులు
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే
చెత్త, గుర్రపుడెక్కతో కృష్ణా కాలువ
ముందస్తు సాగుకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. కాలువలకు నీళ్లు వదిలి 17 రోజులు కావస్తున్నా ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ ప్రకటనలు, అధికారుల మాటలు విని నారుమళ్లు పోసిన అన్నదాతలు నీళ్ల కోసం కాలువల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ప్రస్తుత ఖరీఫ్లో ముందస్తు సాగు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మునుపెన్నడూ లేని విధంగా కాలువలకు ముందుగానే సాగునీరు వదులుతున్నామని జల వనరుల శాఖ మంత్రి చెప్పారు. అయితే సకాలంలో కాలువ మరమ్మతులు పూర్తికాకపోవడంతో కృష్ణమ్మ ప్రవాహం మందగించింది. నారుమళ్లు పోసిన అన్నదాతలు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. 10న నీళ్లు వదిలారా.. ఇంకా ఏలూరుకు చేరుకోలేదేమని రైతులు అడుగుతుంటే అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ముందస్తులో భాగంగా ఈ నెల 10న కృష్ణా- ఏలూరు కాలువకు నీటిని విడుదల చేశారు. సాధారణంగా నీరు వదిలిన మూడో రోజుకు ఏలూరుకు చేరుతుంది. 17 రోజులైనా నీరు చేరలేదు. కాలువకు నీటిని కట్టేసిన సమయంలో చేయాల్సిన పనులను నీరు వదిలిన తరువాత ప్రారంభించారు. పనులు కొనసాగుతుండటంతో పాటు తక్కువ నీటిని విడుదల చేయడంతో దిగువకు రావడం లేదు.
సాగుతున్న పనులు.. ఏటా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా కాలువలు, లాకులకు మరమ్మతులు, తూడు, గుర్రపుడెక్క తొలగింపు వంటివి చేపడుతుంటారు. ఈ ఏడాది కూడా కృష్ణా- ఏలూరు కాలువలో పెరికీడు, ఏలూరు సెక్షన్ల పరిధిలో మరమ్మతులు చేపట్టారు. పెరికీడు సెక్షన్ పరిధిలోని కాలువలో దుక్కి దున్నడం, తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఏలూరు గ్రీన్ సిటీ నుంచి కొమడవోలు వంతెన వరకు పూడిక తొలగింపు పనుల్ని ఇటీవల మొదలుపెట్టారు. దెబ్బతిన్న పడమర లాకుల షట్టర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. రూ.60 లక్షల అంచనాలతో చేయాల్సిన పనులు ఇంకా మొదలు పెట్టలేదు. కృష్ణా ఏలూరు కాలువకు ఉపకాలువలైన ముప్పర్రు, మాదేపల్లి, చాటపర్రు, సీతంపేట ఛానల్లో తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేసేందుకు రూ.30 లక్షలు అంచనాలతో అనుమతులు ఇచ్చారు. ఈ పనులను ఇంకా ప్రారంభించలేదు. ఫలితంగా రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
సాగునీటికి ఎదురుచూపులు.. కృష్ణా- ఏలూరు కాలువ కింద జిల్లాలో 55 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ముందస్తుగా సాగునీరు వదిలారని రైతులు చాలాచోట్ల వేసవి దుక్కులు దున్ని ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. విత్తనాలు చల్లి నారుమళ్లను సిద్ధం చేశారు. నీటి కోసం అధికారులను అడుగుతుంటే అదిగో ఇదిగో వస్తాయని చెబుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాలు చల్లా.. కాలువకు నీరు వదిలారని ఆరెకరాలకు సరిపడా వరి విత్తనాలు చల్లా. ఏటా కాలువకు నీరు వదిలిన మూడు నాలుగు రోజుల్లో చేరేది. నీరు రాగానే నారుమళ్లను తడి అందించేవాళ్లం. రోజులవుతున్నా కాలువకు నీరు రాలేదు. నీరు అందకుంటే నారుమడి దెబ్బతింటుంది. మళ్లీ విత్తనాలు కొని నారుమళ్లు పోయాలంటే అదనపు భారం అవుతుంది. - శివయ్య, వెంకటాపురం
రెండు రోజుల్లో నీరు.. కాలువలకు మరమ్మతులు కొనసాగుతున్నాయి. కృష్ణా నది నుంచి ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనిని 700 క్యూసెక్కులకు పెంచుతున్నారు. రెండు రోజుల్లో కాలువలకు నీరు చేరుతుంది. రైతులు నారుమళ్లకు సిద్ధం చేసుకోవచ్చు.
- సుబ్రహ్మణ్యం, ఏఈ, ఏలూరు కాలువ
నారుమడికి సిద్ధం చేసిన పొలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే