కార్యదర్శుల బదిలీలు ఎలా?
సాధారణ బదిలీలకు గడువు సమీపిస్తుండటంతో ఉద్యోగులు తమకు నచ్చిన చోటుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఈ నెల 17లోగా బదిలీలు పూర్తి చేయాలనుకున్నా.. గడువు తేదీని 30 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయం కమిషనర్ తాజా ఆదేశాలతో సంక్లిష్టంగా మారింది. గ్రేడ్లకు అనుగుణంగా
కమిషనర్ ఆదేశాలతో సంక్లిష్టంగా మారిన ప్రక్రియ!
జిల్లా పంచాయతీ శాఖలో కొనసాగుతున్న కసరత్తు
ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే: సాధారణ బదిలీలకు గడువు సమీపిస్తుండటంతో ఉద్యోగులు తమకు నచ్చిన చోటుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఈ నెల 17లోగా బదిలీలు పూర్తి చేయాలనుకున్నా.. గడువు తేదీని 30 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయం కమిషనర్ తాజా ఆదేశాలతో సంక్లిష్టంగా మారింది. గ్రేడ్లకు అనుగుణంగా క్లస్టర్లు కేటాయించాలని ఇచ్చిన ఉత్తర్వుల అమలులో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయా క్లస్టర్లకు అనుగుణంగా గ్రేడ్ల వారీగా కార్యదర్శులు లేకపోవడమే ఇందుకు కారణం.
గ్రామ పంచాయతీల ఆదాయం, విస్తీర్ణాలను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ 1 నుంచి 4 వరకు విభజించారు. పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వాటి స్థాయికి అనుగుణంగా కార్యదర్శులను నియమించారు. ప్రస్తుత సాధారణ బదిలీలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 909 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం 591 క్లస్టర్లు ఉన్నాయి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు 989 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరితో పాటు జిల్లా పంచాయతీ కార్యాలయం, నాలుగు డివిజన్ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, దిగువ శ్రేణి సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం బదిలీలకు కసరత్తు సాగుతోంది. ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. యాభై శాతం మందికి స్థానచలనం కలగనున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవరి స్థాయిలో వారు బదిలీ కోసం నేతల సిఫార్సులు చేయించుకుంటున్నట్లు సమాచారం.
గ్రేడ్ల వారీగా లేరు
అధికారిక గణాంకాల ప్రకారమున్న క్లస్టర్లకు గ్రేడ్ 1 కార్యదర్శులు 244 మంది, గ్రేడ్ 2లో 145 మంది, గ్రేడ్ 3లో 144 మంది, గ్రేడ్ 4లో 58 మంది ఉండాలి. అయితే పంచాయతీల గ్రేడ్ల వారీ పోస్టులకు అనుగుణంగా కార్యదర్శులు లేరు. గ్రేడ్ 1 కేడర్లో 57 పోస్టులు ఖాళీలు ఉండగా.. గ్రేడ్ 2లో 85, గ్రేడ్ 3లో 28 ఉన్నాయి. గ్రేడ్ 4లో మంజూరైన పోస్టులు 58 ఉండగా 105 మంది పని చేస్తున్నారు. అంటే అదనంగా 47 మంది ఉన్నారు. అవసరాలకు తగ్గట్టు గ్రేడ్ల వారీ కార్యదర్శులు లేకపోవడంలో గతంలో పంచాయతీరాజ్ కమిషనర్ బదిలీల విషయంలో ఒక గ్రేడ్ వరకు సడలింపు ఇస్తూ ఆదేశాలు జారీచేశారు. గ్రేడ్ 4 కార్యదర్శిని గ్రేడ్ 3కి, గ్రేడ్ 3 వారిని గ్రేడ్ 2కు నియమించవచ్చు. ఇలా గడిచిన రెండు మూడేళ్లుగా పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీల గ్రేడ్లతో నిమిత్తం లేకుండా కార్యదర్శులను నియమిస్తూ వచ్చారు. తాజాగా ఏ స్థాయి కార్యదర్శిని అదే స్థాయి పంచాయతీకి నియమించాలని స్పష్టం చేయడం సమస్యలకు కారణమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.