logo

మరోసారి వైకాపాదే అధికారం : నాని

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో వైకాపా మరోసారి సత్తాచాటి అధికారంలోకి రానుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. శనివారపుపేటలోని సారధి కల్యాణ మండపంలో ఏలూరు నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 2న ఏలూరులో నిర్వహించే జిల్లా ప్లీనరీ సమావేశానికి భారీగా తరలిరావాలని

Published : 27 Jun 2022 05:31 IST

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో వైకాపా మరోసారి సత్తాచాటి అధికారంలోకి రానుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. శనివారపుపేటలోని సారధి కల్యాణ మండపంలో ఏలూరు నియోజకవర్గ వైకాపా ప్లీనరీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 2న ఏలూరులో నిర్వహించే జిల్లా ప్లీనరీ సమావేశానికి భారీగా తరలిరావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ పరిశీలకులు, ముఖ్యనేతలు దీనికి హాజరవుతారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, ఉన్నమట్ల ఎలీజా, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, కో ఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఇడా ఛైర్మన్‌ మధ్యాహ్నాపు ఈశ్వరి, సాహిత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని