అందరూ ఉన్నా ఒంటరి జీవితమే
కడుపున పుట్టిన వారే కానివారవుతున్నారు. ఆస్తులు ఇమ్మని కొందరు వేధిస్తోంటే.. ఇచ్చాక బయటకు నెట్టేసే వారు మరికొందరు. ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను అందరూ ఉన్న అనాథలుగా మార్చేస్తూ మానవత్వానికే మచ్చ తీసుకొస్తున్నారు. ఇలాంటి వారి గురించి ఏదో సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం.
అవసాన దశలో పండుటాకుల విలవిల
ఉంగుటూరు, న్యూస్టుడే
ఆస్తి పంపకం చేసిన తర్వాత కుమారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ తండ్రి మే 2వ తేదీన ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కుమార్తెలు, కుమారులు ఉన్నా జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ వృద్ధురాలు అనాథగానే బతుకు నెట్టుకొస్తుంది.
ఏలూరు గ్రామీణ మండలం పెద్దకోడెల ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు తనను ఎవరూ పట్టించుకోవడం లేదని రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కాపాడి ఆమెను వృద్ధుల సంరక్షణ కేంద్రంలో చేర్చారు.
కడుపున పుట్టిన వారే కానివారవుతున్నారు. ఆస్తులు ఇమ్మని కొందరు వేధిస్తోంటే.. ఇచ్చాక బయటకు నెట్టేసే వారు మరికొందరు. ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను అందరూ ఉన్న అనాథలుగా మార్చేస్తూ మానవత్వానికే మచ్చ తీసుకొస్తున్నారు. ఇలాంటి వారి గురించి ఏదో సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం. మనవళ్లు, మనవరాళ్లతో ప్రశాంతంగా శేషజీవితాన్ని గడపాల్సిన వారు బతుకు భారంగా నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 40 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. వారిలో సుమారు 6.75 లక్షల మంది వృద్ధులున్నారు. అయినవారు ఆదరించక.. బంధువులు పట్టించుకోకపోవడంతో వందలాది మంది వృద్ధాశ్రమాల్లో తలదాచుకుంటున్నారు.
ఆప్యాయతలు మాయం..
సమాజ పోకడ, మనిషి ఆలోచనల్లో మార్పులొచ్చాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో అందరూ కలిసికట్టుగా ఉండేవారు. కష్టసుఖాలను ఒకరికొకరు పంచుకునేవారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవడం.. ఆదరించేవారు లేకపోవడంతో చాలామంది రోడ్డున పడుతున్నారు. కొందరు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. ఇటీవల వీటి సంఖ్య పెరుగుతోంది. నిరాదరణకు గురైనా కొందరు ఆత్మాభిమానంతో న్యాయం కోసం పోరాడుతున్నారు.
ఎవరిని సంప్రదించాలి..
ఆస్తులు కోసం తల్లిదండ్రులపై కుమారులు, కుమార్తెలు భౌతిక దాడులకు పాల్పడినా, తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేసిన జిల్లా, డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్లను ఆశ్రయించవచ్ఛు 90 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్ 14567 ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్ఛు లేదా స్థానికంగా ఉన్న వృద్ధుల సంక్షేమ సంఘాలను, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్ఛు
అవగాహన కల్పించాలి..
వృద్ధులపై తరచూ జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, వేధింపులు జరగకుండా వారిశేష జీవితానికి భరోసా కల్పించాలంటే 2007 తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం వృద్ధుల సంరక్షణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ చట్టానికి సంబంధించి విషయాలను నోటీసు బోర్డుల్లో పెట్టాలి. వృద్ధుల సంరక్షణ కోసం రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. - వెంపరాల నారాయణ మూర్తి, వృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?