కౌలు రైతులకు గుర్తింపు ఏదీ ?
జిల్లాలో పంటలు సాగుచేసే వారిలో 80 శాతం మంది కౌలు రైతులే ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందడం లేదు. ఫలితంగా చాలా మంది సాగుకు దూరమవుతున్నారు. సీసీఆర్ కార్డులు అందక పోవడమే దీనికి ప్రధాన కారణం.
సీసీఆర్ కార్డుల అందజేత అంతంత మాత్రం
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే
జిల్లాలో పంటలు సాగుచేసే వారిలో 80 శాతం మంది కౌలు రైతులే ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందడం లేదు. ఫలితంగా చాలా మంది సాగుకు దూరమవుతున్నారు. సీసీఆర్ కార్డులు అందక పోవడమే దీనికి ప్రధాన కారణం.
ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. తొలకరి పలకరించి, కాలువలకు నీళ్లు వదిలి ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సన్నద్ధమైనా సీసీఆర్ (క్రాప్ కల్టివేషన్ రైట్స్-పంట సాగు హక్కు పత్రాలు) కార్డులు నేటికీ పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. జిల్లాలో లక్ష మందికి పైగా కౌలుదారులు ఉంటారని అంచనా వేసిన అధికారులు ఇప్పటి వరకు 18,174 మందికి మాత్రమే మంజూరుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన కొత్త చట్టంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎటువంటి నిబంధనలు లేకపోవడంతో భూమి యజమాని అంగీకారం లేకున్నా రెవెన్యూ అధికారులు కౌలు కార్డులు ఇచ్చేవారు. ప్రస్తుతం కార్డులు ఇవ్వనందున ప్రభుత్వం అందించే సాయం అందడం లేదు.
ప్రయోజనాలివీ
భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం సీసీఆర్ కార్డులు జారీ చేస్తోంది. వీటివల్ల ప్రభుత్వం కౌలు రైతులకు అందించే రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందుతుంది. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందే వీలుండటంతో పాటు రూ.లక్షలోపు రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తే సున్నావడ్డీ వర్తిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం అందించే నష్టపరిహారం పొందవచ్ఛు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులు విక్రయించవచ్ఛు పచ్చిరొట్ట, వరి, అపరాలు తదితర విత్తనాలను రాయితీపై పొందవచ్ఛు
తూతూమంత్రంగా సభలు
కౌలు కార్డుల మంజూరుకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలి. వాస్తవ సాగుదారులను గుర్తించి కార్డులు మంజూరు చేయాలి. వాస్తవానికి సభలను తూతూమంత్రంగా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. గతంలో తహశీల్దార్, ఆర్ఐ, మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో సభలు నిర్వహించేవారు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో వీఆర్వో, రైతు భరోసా సహాయకుడు ఆధ్వర్యంలో సభలు నిర్వహించి కార్డులు మంజూరు చేస్తున్నారు.
అన్ని రకాలుగా నష్టపోతున్నాం..
మాదేపల్లిలో ఆరెకరాలను కౌలు చేస్తున్నా. భూయజమాని అంగీకార పత్రంపై సంతకం చేయకపోవడంతో మూడేళ్లుగా కౌలు గుర్తింపు కార్డు పొందలేకపోయా. రైతు భరోసా సొమ్ము రావడం లేదు. అతివృష్టి, అనావృష్టి సమయాల్లో బీమా పరిహారం అందడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పంటను వేరే వారి పేరున అమ్ముకుంటున్నా. - వాడవల్లి రామారావు, కౌలు రైతు, మాదేపల్లి
ప్రయోజనాలు అందడం లేదు..
మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. అంగీకార పత్రంపై భూ యజమాని సంతకం లేనిదే కౌలు కార్డు ఇవ్వలేమని అధికారులంటున్నారు. కార్డు లేనందున ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు పడుతున్నా. రబీకి సంబంధించి రెండు ఎకరాల ధాన్యం బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదు. - ఏలూరు సుబ్బారావు, కౌలు రైతు, పోతునూరు
అవగాహన కల్పించాలి..
కౌలు రైతుల పరిస్థితులపై జిల్లావ్యాప్తంగా సర్వే చేపట్టాం. కొత్త కౌలు చట్టం గురించి చాలామందికి అవగాహన లేదు. భూ యజమానులు అంగీకార పత్రంపై సంతకాలు చేయడం లేదు. అధికారులు వారి అపోహలు తొలగించేందుకు అవగాహన కల్పించాలి. గతంలో మాదిరిగా భూ యజమాని అంగీకారంతో నిమిత్తం లేకుండా వాస్తవ సాగుదారులకు కార్డులు మంజూరు చేయాలి. -కె.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
లక్ష్యం మేరకు జారీకి కృషి..
నిర్దేశిత లక్ష్యం మేరకు పంట సాగు హక్కు పత్రాలు జారీ చేసేందుకు కార్యాచరణ చేపట్టాం. ఇప్పటివరకు 18 వేలు జారీ చేశాం. కౌలుకు ఇచ్చినట్లు భూ యజమాని అంగీకారం ఇస్తే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. భూ యజమానుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు కౌలు రైతు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. - రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!