శకటానికి బకాయిల సంకటం!
కాలంతో పని లేకుండా నిరంతరం సేవలు అందించాల్సిన అగ్నిమాపక శాఖకు ఇంధన బిల్లుల బకాయిలు భారంగా మారుతున్నాయి. అగ్నిమాపక వాహనాలకు సంబంధించి 9 నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కొన్ని నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో స్థానిక పెట్రోలు బంకుల నిర్వాహకులు
భీమవరం పట్టణం, న్యూస్టుడే: కాలంతో పని లేకుండా నిరంతరం సేవలు అందించాల్సిన అగ్నిమాపక శాఖకు ఇంధన బిల్లుల బకాయిలు భారంగా మారుతున్నాయి. అగ్నిమాపక వాహనాలకు సంబంధించి 9 నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కొన్ని నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో స్థానిక పెట్రోలు బంకుల నిర్వాహకులు ఇంధనం నింపేందుకు ససేమిరా అంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు ఉద్యోగులు, సిబ్బంది బాధ్యత వహించి వాహనాలకు ఇంధనం పోయిస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో కొన్నిచోట్ల ఒకేరోజు రెండు మూడు అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు వాహనాలు సకాలంలో ఆయా ప్రాంతాలకు చేరాలంటే ఇంధనం పూర్తిస్థాయిలో ఉండాలి. లీటరు డీజిల్ 4 కిలోమీటర్లకు సరిపోతుంది. కొన్ని గ్రామాలకు వెళ్లిరావాలంటే 30 నుంచి 50 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే 10 నుంచి 12 లీటర్లు డీజిల్ అవసరమవుతుంది. ఇక మంటలను ఆర్పే సమయంలో వాహన ఇంజిన్ పనిచేయాలి. 20 నిమిషాల పాటు ఇంజిన్ పనిచేస్తే 2 లీటర్ల ఇంధనం అవసరమవుతుంది.
ఇదీ పరిస్థితి..
పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడులలో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. కొన్ని కేంద్రాలకు రూ.లక్ష నుంచి రూ. 1.20 లక్షల వరకు ఇంధన బిల్లుల బకాయిలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ మొత్తం రూ.20 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రతి మూడు నెలలకోసారి బిల్లుల వివరాలు, చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేస్తుంటామని జిల్లా అగ్నిమాపక ముఖ్య అధికారి కె.శ్రీనివాసరావు చెప్పారు. త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. తాడేపల్లిగూడెం కేంద్రానికి ఇటీవల కొంత సొమ్ము వచ్చినా ఇంకా రూ.75 వేల వరకు బకాయిలు ఉన్నాయి. నరసాపురంలో ఆరు, తణుకులో నాలుగు నెలలుగా, పాలకొల్లులో ఏడాదిగా, ఏలూరు జిల్లా కైకలూరులో 8, ఉంగుటూరులో 6 నెలలుగా బకాయిలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM