రోడ్డెక్కిన రైతన్న
జూన్ 1న గోదావరి జలాలను విడుదల చేసిన యంత్రాంగం.. 150 రోజుల కాల వ్యవధిలో అంటే జూన్ 30 నాటికి నాట్లు వేసి అక్టోబరు ఆఖరుకు ఖరీఫ్ సాగు పూర్తిచేయాలని నిర్దేశించారు. ఇంత వరకు బాగానే ఉన్నా సాగుకు ముందుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక అన్నదాతలు అయోమయంలో ఉన్నారు.
ధాన్యం సొమ్ములు రాక ఇక్కట్లు
సాగు పెట్టుబడికి వెతుకులాట
ఆచంట, పెనుమంట్ర, న్యూస్టుడే: జూన్ 1న గోదావరి జలాలను విడుదల చేసిన యంత్రాంగం.. 150 రోజుల కాల వ్యవధిలో అంటే జూన్ 30 నాటికి నాట్లు వేసి అక్టోబరు ఆఖరుకు ఖరీఫ్ సాగు పూర్తిచేయాలని నిర్దేశించారు. ఇంత వరకు బాగానే ఉన్నా సాగుకు ముందుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. మే 5 తర్వాత ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకూ పైసా చెల్లించలేదు. రేపోమాపో సొమ్ములు వస్తాయి.. నారుమడులు సిద్ధం చేసుకోవచ్చని ఎదురుచూస్తున్న కర్షకులకు నిరాశే ఎదురైంది. మరోపక్క సాగు సమయం కూడా దాటిపోవడంతో ఖరీఫ్ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఫలితంగా ధాన్యం సొమ్ముల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి జిల్లాలో సుమారు 5.57 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు 30 శాతం కూడా నారుమడులు సిద్ధం కాలేదు. ప్రస్తుతం సాగు మొదలు పెట్టాలంటే దమ్ములు, విత్తనాలు, ఊడుపులకు ఎకరానికి సుమారు రూ.8 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇప్పటికే రబీ సాగుకు చేసిన అప్పులకు వడ్డీ పెరగడం, ఎరువుల దుకాణదారులు బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 15 రోజుల నుంచి రైతులు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు.
రబీలో 7.83 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 6.70 లక్షల టన్నులను రైతులు నుంచి కొనుగోలు చేశారు. మరో మూడు లేదా నాలుగు రోజుల్లో కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి ప్రభుత్వం రూ.1265 కోట్లు చెల్లించాలి. కానీ రూ.265 కోట్లే చెల్లించింది. ఇంకా సుమారు 70 శాతం మందికి బకాయి పడింది. త్వరలోనే మిగిలిన రైతులకు సొమ్ములు చెల్లిస్తామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు గణనాథ్ తెలిపారు.
వ్యయ భారం పెరిగింది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి