వైరస్ గుబులు
రొయ్యల్లో తెల్లమచ్చల వ్యాధి విజృంభణ
ఆక్వా రైతులు విలవిల
భీమవరం అర్బన్, మండవల్లి, న్యూస్టుడే
ఎగుమతికి సిద్ధంగా ఉన్న రొయ్యలు
రొయ్యల్లో తెల్ల మచ్చల (వైట్ స్పాట్) వ్యాధి సాగుదారులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే ధరలు పడిపోయి కుదేలు అవుతున్న ఆక్వా రైతుల పాలిట ఈ వైరస్ గోరుచుట్టుపై రోకలిపోటులా తయారైంది. దీని ఉద్ధృతితో రెండు వారాల వ్యవధిలోనే వేల ఎకరాల్లో చెరువులు ఖాళీగా మారాయి. చెరువుల్లో స్థాయికి మించి రొయ్య పిల్లలు వేయడం, చెరువుల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈ వ్యాధి సోకుతుంది. ఒక్క చెరువులో ఇది బయటపడినా చెరువులన్నిటికీ గంటల వ్యవధిలోనే వ్యాపిస్తుంది.
జిల్లాలో 90 వేల ఎకరాల్లో రొయ్యలసాగు చేపడతున్నారు. ప్రస్తుతం పిల్ల వేసిన 20 నుంచి 45 రోజుల వ్యవధిలోని 70 శాతం చెరువులు వైరస్ ప్రభావంతో ఖాళీగా మారాయి. కిలోకు 300 నుంచి 600 వరకు రొయ్యలు తూగే సైజులోనే చనిపోతున్నాయి. ఇవి మార్కెట్లో కిలో రూ.30 నుంచి రూ.60 మాత్రమే ధర పలుకుతాయి. మొదటి నెలలో ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుండగా.. వైరస్ సోకితే కనీసం వల ఖర్చులు (ఎకరాకు రూ.20 వేలు) వచ్చే పరిస్థితి లేదు.
అనుకూలించని వాతావరణం..
రొయ్యల సాగుకు ముఖ్యంగా పొడి వాతావరణం అనుకూలం. కానీ ఈ సీజన్లో దీనికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. గడచిన 20 రోజుల్లో రెండు రోజులు మాత్రమే 35 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రత చేరింది. మిగిలిన రోజుల్లో మబ్బులతో చల్లని వాతావరణమే కనిపించింది. ఈ తరహా పరిస్థితులు వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతాయి. ఎండ ఉంటే వైరస్ తీవ్రత కాస్త తగ్గి ఉండేదని నిపుణులు చెబుతున్నారు.
తెల్లమచ్చల వ్యాధి సోకిన రొయ్య తలభాగం
భీమవరం మండలం లోసరికి చెందిన రైతు కె.వెంకటసత్యనారాయణ రెండెకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. తెల్లమచ్చల వ్యాధి సోకడంతో చెరువులో వేసిన రొయ్యల్లో 20 రోజుల వ్యవధిలోనే చనిపోయి రూ.2.30 లక్షల నష్టం వాటిల్లింది. ఇప్పుడు కొత్తగా పెట్టుబడి తెచ్చే పరిస్థితి లేక ఏం చేయాలో పాల్పోని స్థితిలో ఆయన ఉన్నారు. జిల్లాలోని చాలా మంది ఆక్వా రైతులది ఇదే పరిస్థితి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
-
World News
Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
-
India News
Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
-
Sports News
IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్కు మంచిది!
-
Movies News
హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్కు మంచిది!
- Kejriwal: ‘ఆప్ని గెలిపిస్తే..’ గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు
- China: జననాల రేటుపై చైనా కలవరం.. యువ జంటలకు సబ్సిడీలు, పన్ను రాయితీలు..
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!