logo

బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం

ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడు మరణించిన ఘటన పోలవరంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..పోలవరం పంచాయతీ పరిధిలోని యానాదిగూడేనికి చెందిన షేక్‌ శ్రీనుబాబు (33) మంగళవారం రాత్రి

Published : 29 Jun 2022 04:27 IST

పోలవరం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడు మరణించిన ఘటన పోలవరంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..పోలవరం పంచాయతీ పరిధిలోని యానాదిగూడేనికి చెందిన షేక్‌ శ్రీనుబాబు (33) మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద వెనుక నుంచి వస్తున్న కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తలకు గాయమై అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని పోలవరం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. శ్రీనుబాబుకు ఏడాది కిందటే వివాహమైంది. నాలుగు నెలల పాప ఉంది. ప్రమాదం జరిగిందన్న విషయం తెలిసి అక్కడకు వచ్చిన శ్రీనుబాబు తల్లి కుమారుడి మృతదేహాన్ని చూసి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను 108 వాహనంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీనుబాబు మేనమామ షేక్‌ వెంకన్నసాహెబ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీను చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని