logo

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

తెదేపా నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన తెదేపా నాయకుడు సైదు గోవర్ధన్‌ను మంగళవారం ఆయన చరవాణిలో పరామర్శించారు.

Published : 29 Jun 2022 04:35 IST

సైదు గోవర్ధన్‌కు నారా లోకేశ్‌ పరామర్శ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తెదేపా నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన తెదేపా నాయకుడు సైదు గోవర్ధన్‌ను మంగళవారం ఆయన చరవాణిలో పరామర్శించారు. కొల్లేరులో వైకాపా నేతల దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు ఇటీవల తన ఇంటిపై దాడి చేశారని.. వారి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని గోవర్ధన్‌ నారా లోకేశ్‌కు చెప్పారు. సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. వైకాపా నాయకులు తమ అనుచరులతో దాడి చేయించి, తిరిగి తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు అన్నింటిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లామని లోకేశ్‌ వివరించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని, వైకాపా నాయకుల దౌర్జన్యాలు అంతమవుతాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని