ఎన్నాళ్ల్లో వేచిన ఉదయం
జిల్లాలో తొలి విడతలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. తాడేపల్లిగూడెంలోని సముదాయాల్లో ఇళ్ల అప్పగింతను గురువారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పురపాలక కమిషనర్ బాలస్వామి చెప్పారు
తాడేపల్లిగూడెం టిడ్కో ప్రాంగణంలో నేడు ఇళ్ల అప్పగింత
భీమవరం పట్టణం, తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో తొలి విడతలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. తాడేపల్లిగూడెంలోని సముదాయాల్లో ఇళ్ల అప్పగింతను గురువారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పురపాలక కమిషనర్ బాలస్వామి చెప్పారు. జిల్లాలో భీమవరం, పాలకొల్లు పట్టణాల్లోనూ త్వరలోనే గృహప్రవేశాలు ఉంటాయని టిడ్కో ఈఈ స్వామినాయుడు స్పష్టం చేశారు. తొలివిడతలో తాడేపల్లిగూడెంలో 2,272, భీమవరంలో 1,920, పాలకొల్లులో 1,856 ఫ్లాట్లను కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్లు పూర్తయిన వారికే..
తాడేల్లిగూడేనికి తొలివిడతలో 5376 టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయి. సుమారు 58 ఎకరాల విస్తీర్ణంలో గృహ నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయి. తరువాత ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిపై లబ్ధిదారులు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది. పట్టణానికి మంజూరైన 5376 గృహాల్లో 2272 మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటిని నవంబరు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన వారికి మాత్రమే టిడ్కో ఇళ్లు దక్కనున్నాయి. తాడేపల్లిగూడెంలో 1800 మంది లబ్ధిదారులకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన 472 మందికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించేలా పురపాలక అధికారులు చర్యలు చేపట్టారు. ఎంచుకున్న ఇళ్లకు సంబంధించి మొత్తం సొమ్మును డీడీ రూపంలో చెల్లిస్తే వారికి కూడా ఇళ్లను ఇచ్చే అవకాశం కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు