అనుమతి కొంత.. అక్రమ రవాణా కొండంత!
గోదావరి తీరంలో విస్తరించిన పెరుగులంక భూముల్లో తువ్వమట్టి లభిస్తోంది. దీనికి గిరాకీ ఉండటంతో అధికార పార్టీ నాయకులు, అక్రమార్కులు తువ్వపై కన్నేసి లంకలన్నీ గుల్లచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు మట్టి రవాణాకు స్థానిక వీఆర్వోకు దరఖాస్తు చేస్తున్నారు.
గుల్లవుతున్న లంక భూములు
ఇటుక బట్టీల దగ్గర తువ్వమట్టి నిల్వలిలా
యలమంచిలి మండలం కాంబోట్లపాలెం, బూరుగుపల్లి, యలమంచిలిలంక సరిహద్దుల్లోని పెరుగులంక భూముల్లోని తువ్వ మట్టిని జిల్లాలోని పలుప్రాంతాలతోపాటు కొనసీమ జిల్లాకు టిప్పర్లతో నిత్యం రవాణా చేస్తున్నారు. ఈ విధంగా ఏటా రూ. కోట్లలో మట్టి దందా మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలుగా సాగిపోతుంది.
ఆచంట మండలం కరుగోరుమిల్లి నుంచి చుట్టూ ఉన్న పేదల లేఅవుట్ల పూడిక నిమిత్తం తువ్వ మట్టి రవాణాకు ఇటీవల అధికారులు అనుమతించారు. దీని ముసుగులో సమీపంలోని యలమంచిలి, పాలకొల్లు మండలాల్లోని ఇటుక బట్టీలకు, ప్రైవేటు లేఅవుట్లకు కరుగోరుమిల్లి నుంచి వందలాది ట్రక్కుల మట్టి రేయింబవళ్లు రవాణా అవుతోంది. అక్కడ ఉచితంగా లభించే మట్టిని ట్రక్కు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు బయట విక్రయిస్తున్నారు.
తువ్వ దందా.. గోదావరి తీరంలో విస్తరించిన పెరుగులంక భూముల్లో తువ్వమట్టి లభిస్తోంది. దీనికి గిరాకీ ఉండటంతో అధికార పార్టీ నాయకులు, అక్రమార్కులు తువ్వపై కన్నేసి లంకలన్నీ గుల్లచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు మట్టి రవాణాకు స్థానిక వీఆర్వోకు దరఖాస్తు చేస్తున్నారు. దానిపై ఎన్ని ట్రక్కుల మట్టి అవసరమనేది లబ్ధిదారు పొందుపరచడం లేదు. దానిని రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు అక్రమార్కులు దీనిని అవకాశంగా మలచుకుంటున్నారు. ఇటీవల ఇదే తరహాలో నరసాపురం మండలం సీతారామపురం నుంచి యలమంచిలికి నాలుగు రోజులపాటు విచ్చలవిడిగా మట్టి రవాణా జరిగింది. అధికారులను అడిగితే ఇంటి నిర్మాణానికి మట్టి కావాలని దరఖాస్తు చేసుకున్నారని దానిపై ఎంతనేది రాయలేదని పేర్కొనడం గమనార్హం.
తువ్వకు మంచి గిరాకీ..
లంక తువ్వతో తయారైన ఇటుకలకు నాణ్యత ఉంటుందని పేరు. అందువల్ల బట్టీలకు ఎక్కువగా తువ్వమట్టిని తెచ్చుకుని కొంత నల్లమట్టితో కలిపి ఇటుక తయారు చేస్తుంటారు. దీనికోసం గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. గృహనిర్మాణశాఖ అధికారులిచ్చిన కూపన్ ఉంటే కరుగోరుమిల్లిలో తువ్వ ఉచితంగా ఇచ్చి కేవలం ఎగుమతి, రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అక్కడ ఉచితంగా వచ్చిన దాన్ని బయట టిప్పర్ లోడు రూ.10వేల వరకు విక్రయిస్తున్నారు. దీనిపై ఏలూరు మైనింగ్ ఏడీ శ్రీనివాస్ను ‘న్యూస్టుడే’ సంప్రదించగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతి తీసుకుని బయటకు విక్రయించడం నేరమని, ఇటువంటి వాటిని స్థానిక రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి పట్టుకోవచ్చని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు