ఎప్పటిలానే..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. నూతన విద్యా సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విద్యారంగంలో నూతన విధానాల అమలులో భాగంగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ బాలికల జూనియర్
జూనియర్ కళాశాలల్లో సమస్యల తోరణాలు
నేటి నుంచి పునఃప్రారంభం
తరగతిగదిలోనే ప్రయోగశాల
ఏలూరు విద్యావిభాగం, న్యూస్టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. నూతన విద్యా సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విద్యారంగంలో నూతన విధానాల అమలులో భాగంగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం జడ్పీ ఉన్నత పాఠశాలలను వర్గోన్నతి చేయనున్నట్లు పేర్కొంది. వీటిని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు.
వెంటాడుతున్న ఇబ్బందులు
* దాదాపు 60 వసంతాల చరిత్ర కలిగిన పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లాల విభజనకు ముందు షిఫ్టుల విధానంలో డిగ్రీ కళాశాల ఆవరణలో నడిపేవారు. 1996లో విడిగా జూనియర్ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఏడు గ్రూపులను బోధిస్తున్నారు. ఏటా దాదాపు 600 మంది చదువుకుంటున్నారు. వీరికి తగినన్ని తరగతి గదులు లేనందున వరండాలో, సిబ్బంది విశ్రాంతి తీసుకునే గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.
* తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య బాగానే ఉన్నా మౌలిక సదుపాయాలు లేవు. మరుగు దొడ్ల వినియోగానికి నీటి సౌకర్యం లేదు. తాగునీటి సదుపాయమూ లేదు. తాగునీటిని బయటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని తరగతి గదులు, అవసరమైన ఫర్నిచర్ లేదు.
పాతికేళ్లుగా పరాయిపంచనే!
చిందరవందరగా తరగతి గది
యలమంచిలి, న్యూస్టుడే: యలమంచిలి జూనియర్ కళాశాల 1997లో ప్రారంభించారు. సొంత భవనం లేక స్థానిక ఉన్నత పాఠశాల పైఅంతస్తులో ఒక పక్కన తరగతుల నిర్వహణకు తాత్కాలికంగా కేటాయించారు. అప్పట్నుంచి భవనం నిర్మించింది లేదు. మొత్తం నాలుగు విభాగాలుండగా సుమారు వంద మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. కార్యాలయం, ప్రయోగశాలకు, గదులు సరిపడక తరగతి గదుల్లోనే ఇరుకిరుకుగా కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా మరుగుదొడ్లు లేక ఉన్నత పాఠశాలకు ఉన్న వాటినే వినియోగిస్తున్నారు.
ఖరారుకాని విధి విధానాలు
మండలానికి ఒకటి చొప్పున ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఏలూరు జిల్లాలో 26, పశ్చిమగోదావరి జిల్లాలో 18 కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. వీటిలో కొన్నింటిని ఈ విద్యా సంవత్సరం, మరికొన్నింటిని వచ్చే సంవత్సరం ప్రారంభిస్తారంటూ ప్రచారం సాగుతోంది. కొత్తగా ఏర్పడే కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను చేపట్టడం తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని ఏలూరు డీఈవో ఆర్ఎస్ గంగాభవాని తెలిపారు.
మరుగుదొడ్ల పరిస్థితి ఇలా..
అత్తిలి, న్యూస్టుడే: కరోనా పరిస్థితులకు ముందు అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునాది వద్ద నిర్మాణ పనులు ఆగిపోయాయి. విద్యార్థులకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో ఆంగ్లమాధ్యమ తరగతులు ప్రారంభమైతే జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.