Raghurama: రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న రఘురామ.. అభిమానుల బైక్‌ ర్యాలీ

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

Published : 02 Jul 2022 22:33 IST

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం భీమవరం రానున్నారు. సుమారు రెండేళ్ల తర్వాత భీమవరం రానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ట్రిపుల్‌ ఆర్‌ జిందాబాద్‌ అంటూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రఘురామ సొంత నియోజకవర్గంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం తనను అరెస్టు చేయకుండా రఘురామకృష్ణరాజు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని