వైౖద్యం డొల్ల.. జేబులు గుల్ల!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్యం ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే చాలు అక్కడ వైద్యులు బాదుడే బాదుడు అన్న చందంగా రోగుల నుంచి అందినకాడికి
వణికిస్తున్న బిల్లులు
ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలువు దోపిడీ
తణుకు, న్యూస్టుడే:
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్యం ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే చాలు అక్కడ వైద్యులు బాదుడే బాదుడు అన్న చందంగా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొంత మంది ఆర్థిక స్థోమతలేని బాధితులు బిల్లులు చెల్లించేందుకు పుస్తెలు సైతం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఎక్కడ చూసినా.. కాలానుగుణ వ్యాధుల ప్రభావంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పలు చోట్ల ఓపీ నమోదుకే ఒక పూటంతా నిరీక్షించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యుడిని కలవాలంటే రూ.300 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల నెల రోజులు ఉన్న ఓపీని పదిహేను రోజులకు కుదించడం గమనార్హం. సూపర్ స్పెషాలిటీ పేరుతో సాధారణ గదిలో ఉన్న వారి నుంచి రోజుకు రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు ఛార్జీ వేస్తున్నారు. సాధారణ జ్వరమైనా వైద్యుడు నాడి పట్టాలంటే ముందు పరీక్షలు, స్కానింగ్ తప్పనిసరి. సాధారణ జ్వరం, జలుబుతో ఆసుపత్రికి వెళ్తే రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. మరో వైపు పీఎంపీలు కమీషన్ల కోసం రోగులను కార్పొరేట్ ఆసుపత్రులకు సిఫార్సులు చేస్తున్నారు.
*తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతూ వృద్ధుడు చికిత్స నిమిత్తం చేరారు. అతనికి రెండు రోజులు చికిత్స చేశారు. సుమారు రూ. 80 వేల వరకు బిల్లు వసూలు చేశారు. బిల్లు చెల్లించినా పరిస్థితి విషమంగా ఉందని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. దీంతో బాధిత బంధువులు, సంఘ నాయకులు ఆసుపత్రి యాజమాన్యంతో ఘర్షణకు దిగారు. దీంతో ఆ నగదు మొత్తం తిరిగి ఇచ్చారు.
*భీమవరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి యువకుడు మృతి చెందారు.
*తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన బాలుడు జ్వరం, వాంతులతో బాధ పడుతూ తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజుల పాటు చికిత్స అందించి రూ.40 వేల బిల్లు వసూలు చేశారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉందని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స నిమి త్తం ముక్కు ద్వారా గొట్టం పంపే క్రమంలో బాలుడు మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
* ‘‘ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్ల్లో డెంగీ పరీక్షలు చేయకూడదు. కానీ కొన్ని ఆసుపత్రుల్లో చేస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించి నగదు వృథా చేసుకోవద్దు.’’ అని వైద్యాధికారి బి.రవి తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు : సుమారు 600
నిత్యం రోగుల సంఖ్య 1.40 లక్షల మంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపించాలి
[ 23-04-2024]
పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తొలిమెట్టు.. అదిరేట్టు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తాచాటారు. -
మధ్యంతర భృతికి మంగళం
[ 23-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. -
ఎన్నికల ఎర.. యువత విలవిల
[ 23-04-2024]
రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 7,900 పోస్టులకు మాత్రమే డీఎసీˆ్స ప్రకటన ఇచ్చింది.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎసీˆ్స పెడతానని చెబుతున్నా.. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. -
వైకాపా మాయలోపడి రాజీనామాలు చెయ్యొద్దు: నిమ్మల
[ 23-04-2024]
వైకాపా మాయలోపడి వాలంటీర్లు రాజీనామాలు చెయొద్దని, తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు రూ.10 వేతనం ఇస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. -
గ్రంధి ఏనాడైనా పవన్లా సేవ చేశారా?
[ 23-04-2024]
ఓటమి తప్పదని తెలిసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మెగా బ్రదర్స్పై ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామమోహనరావు విమర్శించారు -
చితికిలబడింది
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా చతికిలపడింది. పునర్విభజన అనంతరం జిల్లా గత ఏడాది 22వ స్థానంలో నిలవగా.. ఈసారి 25వ స్థానానికి దిగజారింది. విద్యార్థులు 80.08 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 15.73 శాతం పెరగడం చెప్పుకోదగిన విషయం. -
ప్రగల్భాలు తప్ప.. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఏరి?
[ 23-04-2024]
గ్రామీణ ప్రజల ఇళ్ల వద్దే నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్య విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం మాదే.. -
23వ స్థానంలో పశ్చిమ
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది -
సాయం ఎగనామం
[ 23-04-2024]
తెదేపా హయాంలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలతోపాటు చేతి వృత్తుల వారికి 90 శాతం రాయితీపై ఆదరణ పరికరాలిచ్చి దన్నుగా నిలిచారు. -
మీ బిడ్డనన్నావ్.. నిలువునా ముంచేశావ్!
[ 23-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలు నిర్మించుకున్న కొందరు లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. 2018, 2019 సంవత్సరాల్లో వీరు పనులు ప్రారంభించగా బిల్లులన్నీ 2020లో చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ప్రకటించింది. -
అయిదేళ్లుగా ఏటా నష్టమే!
[ 23-04-2024]
2023 డిసెంబరులో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 12,438 హెక్టార్లలో వరి, 214 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. -
అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి -
హామీల వల వేసి.. ముంచేసి
[ 23-04-2024]
నవంబరు21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ బియ్యపుతిప్ప హార్బరు, కార్గోపోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. -
బోరుపైపు నుంచి మంటలు
[ 23-04-2024]
యలమంచిలి రెవెన్యూ పరిధిలోని కొత్తలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరు పైపు నుంచి సోమవారం మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది
తాజా వార్తలు (Latest News)
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు