ముంపు ముంగిట..భయం గుప్పిట!
ఎర్రకాలువ మళ్లీ కన్నెర్ర చేసింది. నందమూరు అక్విడక్టు వద్ద ప్రవాహ ఉద్ధృతి పెరగడంతో ఇప్పటికే ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ప్రమాదకరంగా యనమదుర్రు డ్రెయిన్ గట్లు
పాలకోడేరు మండలం గరగపర్రు సమీపాన బలహీనంగా గట్టు
భీమవరం పట్టణం, గణపవరం, న్యూస్టుడే
ఎర్రకాలువ మళ్లీ కన్నెర్ర చేసింది. నందమూరు అక్విడక్టు వద్ద ప్రవాహ ఉద్ధృతి పెరగడంతో ఇప్పటికే ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరీవాహక ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉండటంతో యనమదుర్రు డ్రెయిన్ పరిధిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. డ్రెయిన్ నిర్వహణ, శాశ్వత నిర్మాణాలపై యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో ఏటా సార్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద ఘంటికలు..
ఎర్రకాలువ తాడేపల్లిగూడెం మండలం నందమూరు అక్విడక్టు నుంచి యనమదుర్రు డ్రెయిన్గా మారుతుంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, తణుకు, పాలకోడేరు, ఉండి, భీమవరం మండలాల్లో పలు గ్రామాల మీదుగా 61.5 కిలోమీటర్లు ప్రవహించి మొగల్తూరు మండలంలో సముద్రంలో కలుస్తుంది. డెల్టా ఆధునికీకరణలో భాగంగా 2008లో రూ.60 కోట్లు మంజూరవగా.. మట్టి పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. చాలా చోట్ల గట్టు బలహీనంగా ఉంది. ఔట్లెట్లు, ఇన్లెట్లను పటిష్ఠపరచలేదు. ప్రవాహ ఉద్ధృతి పెరిగితే గట్టుకు గండిపడటంతో పాటు షట్టర్లు లేచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి
* పాలకోడేరు మండలం గరగపర్రు సమీపాన యనమదుర్రు డ్రెయిన్ గట్టు బలహీనంగా మారడంతో తడికలు, కర్రలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. అవి ప్రవాహ ఉద్ధృతికి దిగబడిపోవడంతో గట్టు కోతకు గురవుతుంది. గతంలో ఇదే ప్రాంతంలో గట్టు బలహీనంగా మారి వరద నీరు పొంగి ప్రవహించగా ఇసుక, మట్టి సంచులు వేసి తాత్కాలిక మరమ్మతులు చేశారు.
* గణపవరం మండల పరిధిలో యనమదుర్రు డ్రెయిన్ ఇన్లెట్లు శిథిల దశకు చేరుకున్నాయి. చిలకంపాడు సెక్షన్ పరిధిలో కుడిగట్టుకు పెంటపాడు మండలం బి.కొండేపాడు, గణపవరం మండలం కోమర్రు, పిప్పర, కేశవరాల్లో ఇన్లెట్లు ఉన్నాయి. వీటి మరమ్మతులకు వేసవిలో రూ.8.60 లక్షలు మంజూరయ్యాయి. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ఆ పనులు చేపట్టలేదు.
* మండపాక సెక్షన్ పరిధిలోకి వచ్చే ఎడమ గట్టుకు గణపవరం మండల పరిధిలో ఆరు ఇన్లెట్లు ఉన్నాయి. వీటిలో మూడు చోట్ల కొత్తవి ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.1.14 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు.
* భీమవరం పరిధిలో శిథిల షట్టర్ల మరమ్మతులు, కొత్తగా తలుపులు బిగించేందుకు రూ.10 లక్షలు కేటాయించారు. ఇంకా పనులు పూర్తికాలేదు.
గండ్లు పడి..
గతంలో యనమదుర్రు డ్రెయిన్కు అనేకచోట్ల గండ్లు పడి పలు ప్రాంతాలు ముంపు బారినపడ్డాయి. ఉండి మండలం యండగండి వద్ద, గణపవరం మండలం కేశవరం, పిప్పర వద్ద గట్టుపై నుంచి వరదనీరు పొంగి గ్రామాల్లోకి చేరింది. 1986లో గండి పడటంతో భారీస్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. పలు మండలాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో వృథా నీటితో పాటు మేజర్ డ్రెయిన్ల నుంచి వచ్చే మురుగంతా యనమదుర్రులోకే చేరుతుంది. కొన్నిచోట్ల ఈ డ్రెయిన్ వెడల్పు తగ్గిందని, ప్రవాహ సామర్థ్యానికి తగ్గట్టుగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని జలవనరుల నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవల కొద్దిపాటి వర్షానికే పిప్పరలో జలమయమైన కాలనీ
గుర్తించి చర్యలు చేపడతాం
దువ్వ ప్రాంతానికి ఎగువన యనమదుర్రు డ్రెయిన్ గట్టు బలహీనంగా ఉన్నచోట ఇటీవల మరమ్మతులు చేయించామని జలవనరుల శాఖ ఈఈ దక్షిణామూర్తి చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైనా గట్టు కోతకు గురైనా, బలహీనంగా ఉన్నా గుర్తించి తగు చర్యలు చేపడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్