త్యాగాల దీప్తి.. ఉద్యమ స్పూర్తి..!
స్వాతంత్య్ర సంగ్రామంలో కొల్లేటి ప్రాంత వాసుల పాత్ర అజరామరంగా నిలిచిపోతుంది. బ్రిటిష్ పాలకుల ఉన్మాదాలు.. భారతీయులకు ఊపిరాడనివ్వని ఉదంతాలు ఇక్కడ ప్రజల్లో ఉక్రోశాన్ని నింపాయి. వారి త్యాగాలు ఇప్పటికీ ప్రజా హృదయాల్లో నిలిచే ఉన్నాయి.
జీవితాన్ని ప్రేమిస్తాం..
మరణాన్ని ప్రేమిస్తాం..
మేము మరణించి, ఎర్రపూలవనంలో పూలై పూస్తాం.. -భగత్సింగ్
స్వాతంత్య్రానికి పూర్వం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జిల్లా ఆవిర్భవించింది. 1925లో ఏలూరు ప్రధాన కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడింది. అప్పటి వరకూ ఉభయ గోదావరి జిల్లాలు గోదావరి జిల్లా పేరుతో ఉండేవి. 1925లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు.
-న్యూస్టుడే, కుక్కునూరు
కలిదిండి, న్యూస్టుడే : స్వాతంత్య్ర సంగ్రామంలో కొల్లేటి ప్రాంత వాసుల పాత్ర అజరామరంగా నిలిచిపోతుంది. బ్రిటిష్ పాలకుల ఉన్మాదాలు.. భారతీయులకు ఊపిరాడనివ్వని ఉదంతాలు ఇక్కడ ప్రజల్లో ఉక్రోశాన్ని నింపాయి. వారి త్యాగాలు ఇప్పటికీ ప్రజా హృదయాల్లో నిలిచే ఉన్నాయి.
ఎందరో మహానుభావులు.. కైకలూరు ప్రాంతానికి చెందిన అనేక మంది ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆంగ్లేయుల బెదిరింపులు.. దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచారు. గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, ఘంటా పేరయ్య, మాగంటి సత్యనారాయణ, కంతేటి కాశీవిశ్వనాథం, మాగంటి నాయుడమ్మ, రుద్రరాజు సత్యనారాయణరాజు, చిర్రవూరి అచ్యుతరామయ్య, మేకా తిరుపతయ్య, పొన్నాడ శ్రీరామచంద్రుడు, ఉన్నూరు నరసింహరాజు, గుంటూరు రామదాసు వంటి వారెందరో ఉద్యమానికి ఊపిరి పోశారు. మహిళలు సైతం కదంతొక్కారు.
బుడిబుడి అడుగులు వేశా..
భారతగడ్డపై మువ్వన్నెల జెండా ఎగిరే నాటికి నాకు పన్నెండేళ్లు. చిరుప్రాయంలోనే గాంధీ, నెహ్రూ వంటి జాతీయ నేతల మాటలు ఎంతగానో ప్రభావం చూపించేవి. కొల్లేరు ప్రాంత ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమంలో పాలుపంచుకునేవాళ్లు. రాత్రి, పగలు తేడా లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. పోరాట పటిమ చూపించేవారు. ఎన్నోసార్లు ఆ సభల వైపు బుడిబుడి అడుగులు వేశా.87 ఏళ్ల వయసులోనూ ఆ ఉత్తేజం.. ఉద్వేగం ఇప్పటికీ నా నరనరాల్లో ఉరకలేస్తూనే ఉంది. - చెరుకువాడ శివరామరాజు, రామకృష్ణ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, దొడ్డిపట్ల
ఊరంతా ఒక్కతాటిపై..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి నాకు ఏడేళ్లు. ఊరంతా ఒకటే బాట.. బడికెళ్లినా అదే మాట. ‘ఆంగ్లేయులను తరిమికొట్టాలి.. దేశాన్ని కాపాడుకోవాలి’ అన్న తలంపే అందరిలోనూ ఉండేది. ‘ఎక్కడెక్కడ సభలు పెట్టారు.. ఎవరెవరు హాజరయ్యారు?’ అనే విషయాలు నాన్న తన మిత్రులతో చర్చిస్తుంటే వినేవాణ్ని. రేడియోలో జాతీయ నాయకుల ఉపన్యాసాలు ప్రేరణ నింపేవి. ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నా. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఉండిలో రైలును నిలిపివేసిన ఘటనలో పాలుపంచుకున్నా. - నంబూరి వెంకటపతిరాజు, పోతుమర్రు
జనం గుండెల్లో ‘కల్నల్ డీఎస్ రాజుగా’..
విద్యావంతునిగా.. వైద్యునిగా.. మేజర్గా బహుముఖ రూపాల్లో స్వాతంత్య్ర ఉద్యమానికి ఊతమిచ్చారు పశ్చిమగోదావరి జిల్లా పోడూరు గ్రామానికి చెందిన దాట్ల సత్యనారాయణరాజు. చిన్ననాటి నుంచి మానవతా దృక్పథంతో వైద్య వృత్తిని చేపట్టి.. 1934 నుంచి 1945 వరకు సైన్యంలోని వైద్య విభాగంలో విశిష్ట సేవలందించారు. వైద్య విద్యాభివృద్ధి, వైద్యపరమైన పరిశోధనలు, స్వచ్ఛంద వైద్య సాయం తదితర లక్ష్యాలతో 1958లో కాకినాడలో రంగరాయ మెడికల్ కళాశాల నిర్మాణానికి కృషి చేశారు. 1957, 1962, 1967లో కాంగ్రెస్ తరఫున రాజమహేంద్రవరం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. వైద్య, రక్షణ శాఖల్లో డిఫ్యూటీ మంత్రిగా పని చేశారు. 1973లో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణరాజు జనం గుండెల్లో ‘కల్నల్ డీఎస్ రాజు’గా చెరగని ముద్ర వేసుకున్నారు.
దాట్ల సత్యనారాయణరాజు (పాతచిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామయ్య సన్నిధిలో.. రామ రాజుల పలకరింపు
[ 18-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వం విషయంలో పోటీ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురై ఆప్యాయంగా పలకరించుకున్న ఘటన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. -
శిబిరాలే.. చికిత్సల్లేవ్
[ 18-04-2024]
తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి. -
ఉద్ధృతంగా ఏలూరు కాలువ
[ 18-04-2024]
ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఏలూరు కాలువ గట్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
వైకాపా అభ్యర్థిపై సా...గుతున్న విచారణ
[ 18-04-2024]
పాలకొల్లు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి గూడాల శ్రీహరిగోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ప్రచారంలో పలు ప్రాంతాల్లో మహిళలకు నగదు, కానుకలు అందజేశారు -
ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్పై కేసు
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. -
ఇక నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
సమరమే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏలూరు పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు -
జగన్... నిన్ను నమ్ముకుంటే కొంప కొల్లేరు
[ 18-04-2024]
‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణకు చర్యలు చేపడతాం. ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర యుద్ధ ప్రాతిపదికన రెగ్యులేటర్లు నిర్మించి కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’ -
ఇంకెంతన్నారు.. వేతనానికే దిక్కు లేదు
[ 18-04-2024]
వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ : కలెక్టర్
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. -
కుల బహిష్కరణ చేశారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
[ 18-04-2024]
సంఘం పెద్దలను నిలదీసినందుకు తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సొంతిల్లన్నారు.. నట్టేట ముంచారు
[ 18-04-2024]
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది. -
ముహూర్తాలతో సమరానికి సై
[ 18-04-2024]
జిల్లాలో రాజకీయం వేడెక్కనుంది. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో పూర్తిస్థాయి ఎన్నికల సందడి మొదలవనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు