నేపథ్యం గ్రామీణం.. ప్రతిభ జాతీయం!
జంగారెడ్డిగూడెం సీఎస్టీఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో మేటిగా రాణిస్తున్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జట్టులో చోటు సాధించడమే కాకుండా దక్షిణ భారతదేశ స్థాయిలో నిర్వహించిన అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు.
వాలీబాల్ సాధన చేస్తున్న క్రీడాకారిణులు
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: జంగారెడ్డిగూడెం సీఎస్టీఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో మేటిగా రాణిస్తున్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జట్టులో చోటు సాధించడమే కాకుండా దక్షిణ భారతదేశ స్థాయిలో నిర్వహించిన అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్యం కలిగిన ఈ విద్యార్థినులు కళాశాల పీడీ, ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకులు అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడల్లో మరింత రాణించేందుకు నిరంతర సాధన చేస్తున్నారు.
ఏడో తరగతి నుంచి ఆడుతున్నా
‘నన్నయ విశ్వవిద్యాలయం కబడ్డీ జట్టు సభ్యురాలిని. ఏడో తరగతి నుంచి ఆడుతున్నా. తమిళనాడు అలగప్ప యూనివర్సిటీలో నిర్వహించిన అంతర విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీల్లో పాల్గొన్నా. విజయవాడ, మార్టేరు, కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడా. ప్రొకబడ్డీ జట్టులో ఆడాలన్నది నా కోరిక. వ్యాయామ ఉపాధ్యాయిని అవడం నా లక్ష్యం’ అని అంకన్నగూడేనికి చెందిన పైదా అనూష తెలిపారు.
క్రీడా కోటాలో ఉద్యోగమే లక్ష్యం
‘నాకు వాలీబాల్ అంటే ఇష్టం. నన్నయ యూనివర్సిటీ మహిళా జట్టుకు ఎంపికయ్యా. ఈ ఏడాది చెన్నైలో నిర్వహించిన సౌత్ జోన్ పోటీల్లో విశ్వవిద్యాలయం తరఫున ఆడా. జాతీయ క్రీడాకారిణిగా ఎదగాలనుకుంటున్నా. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నాను’ అని లచ్చిగూడేనికి చెందిన జోడే కీర్తి పేర్కొన్నారు.
కబడ్డీ, అథ్లెటిక్స్లో ప్రావీణ్యం
‘సీఎం కప్, తాడేపల్లిగూడెంలో అంతర్ కళాశాలల, ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల ఛాంపియన్ షిప్ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నా. జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించా. ఆరో తరగతి నుంచి ఆడుతున్నా. అనేక పతకాలు సాధించా. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్లోనూ ప్రావీణ్యం ఉంది. ఇటీవల వైజాగ్లో నిర్వహించిన 400 మీటర్ల రిలేలో పాల్గొన్నా. ఎస్సై కావాలన్నది నా ఆశయం’ అని మామిడిగొందికి చెందిన సున్నం అంజలి చెప్పారు.
పీడీ అవుతా
‘ఆరో తరగతి నుంచి వాలీబాల్ ఆడుతున్నా. నాలుగుసార్లు జాతీయ స్థాయిలో ఆడా. పలు పతకాలు అందుకున్నా. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జట్టులో సభ్యురాలిని. చెన్నైలో నిర్వహించిన దక్షిణ భారత అంతర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్నా. ఫిజికల్ డైరెక్టర్ కావాలనుకుంటున్నాను’ అని అరవపల్లికి చెందిన పాయం కీర్తి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి