జోరుగా జూదాలు.. ప్రశ్నిస్తే దాడులు
జూద క్రీడలకు మెట్ట మండలాలు కేంద్రాలుగా మారాయి. సామాజిక బాధ్యతతో సామాన్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా దాడులకు తెగబడుతున్నారు. పోలీసుల అండదండలతో..నాయకుల కనుసన్నల్లో పేకాట, కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
నాయకులు, పోలీసుల అండతో యథేచ్ఛగా పేకాట, కోడిపందేలు
* ‘నా పొలం సమీపంలో కొందరు పేకాడుతున్నారు. మద్యం తాగి ఖాళీ సీసాలను నా పొలంలో వేస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా లెక్క చేయలేదు. వైకాపా కనుసన్నల్లో పని చేస్తున్నారని తెలియక స్థానిక ఎస్సై పేకాట ఆడుతున్న వీడియో పంపించి, చర్యలు తీసుకోవాలని కోరాను. వెంటనే దానిని ఆయన వైకాపా నాయకులకు పంపించారు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా వారు నా పై దాడి చేశారు. కర్రలతో చితకబాదారు. విలువైన నా ఫోన్ లాక్కున్నారు. ఏలూరు ఆసుపత్రికి వెళితే కనీసం చేర్చుకోకుండా ప్రథమ చికిత్స చేసి చేతులు దులుపుకున్నారు. ఎస్సై అన్యాయం చేశారని చెప్పినా అక్కడ సిబ్బంది ఎంఎల్సీ కూడా నమోదు చేయలేదు. నాపై దాడి చేసి తిరిగి నామీదే కేసు పెట్టారు’ అని పెదవేగి మండలం రాయన్నగూడెంకు చెందిన సునీల్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే-పెదవేగి: జూద క్రీడలకు మెట్ట మండలాలు కేంద్రాలుగా మారాయి. సామాజిక బాధ్యతతో సామాన్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా దాడులకు తెగబడుతున్నారు. పోలీసుల అండదండలతో..నాయకుల కనుసన్నల్లో పేకాట, కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్థావరాల నిర్వాహకులు మాత్రం రూ.లక్షలు దండుకుంటున్నారు.
శ్రుతి మించి
పెదవేగి, దెందులూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో పేకాట, కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పెదవేగి మండలం కొండలరావుపాలెం-కలరాయగూడెం మధ్యలో ఉన్న తోటల్లో, పాండా చెరువు సమీపంలోని తోటల్లో షెడ్డు వేసి మరీ జూదం నిర్వహిస్తున్నారు. రాయన్నపాలెం సెంటర్కు సమీపంలోని టవర్స్ దగ్గర కూడా పేకాట స్థావరాలున్నాయి. ఒక్కో స్థావరంలో రోజుకు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ పేకాట నిర్వహణ సాగుతోంది. దెందులూరు మండలం పెరుగుగూడెంలో ఒక్క రోజుకు రూ.20-రూ.25 లక్షల వరకూ చేతులు మారతాయంటే పరిస్థితి అర్థమవుతుంది. పేకాట ఆడేందుకు హనుమాన్ జంక్షన్, గన్నవరం తదితర ప్రాంతాల నుంచీ బడా బాబులు కార్లలో వస్తుంటారు. రాయన్నపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర, కొండలరావు పాలెం తోటల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు.
అందరూ కుమ్మక్కు
ఓ వైపు పేకాట స్థావరాలు..మరోవైపు కోడి పందేల కోలాహలం యథేచ్ఛగా సాగుతున్నా నియంత్రించిన దాఖలాలు లేవు. స్థావరాల నిర్వాహకులకు రాజకీయ అండ పుష్కలంగా ఉందని చెబుతున్నారు. స్వయానా ఓ ప్రజాప్రతినిధి బాబాయే నిర్వహిస్తున్నారని విమర్శలున్నాయి. నిర్వాహకులు, స్థానిక నాయకులు, పోలీసులు కుమ్మక్కై పేకాట స్థావరాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని సమాచారం. పెదవేగి మండలంలో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారని వాటిని అరికట్టాలని రాయన్నపాలెం గ్రామస్థులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోకపోగా వాళ్లు ఆడితే మీకెందుకు..మీ పని చూసుకోండని బెదిరించారని ఆ గ్రామస్థుడొకరు తెలిపారు. ఇలాగే ఫిర్యాదు చేసినందుకు తనపై వైకాపా నాయకులు మూకుమ్మడి దాడులు చేశారని పెదవేగికి చెందిన సునీల్ వాపోయారు. దీనిపై ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఘటనపై తనకు సమాచారం లేదని, ఎమ్మెల్సీ నివేదిక కూడా రాలేదని, అసలు వీడియో గురించి కూడా తనకు తెలియదని చెప్పారు.
ముడుపులు.. పేకాట స్థావరాలు ఏర్పాటు, పోలీసులతో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులదే. దీని కోసం భారీగానే ముడుపులు తీసుకుంటున్నారు. కొందరు ఎంత పందెం వేస్తే అందులో 10 శాతం కమీషన్గా వసూలు చేస్తున్నారు. రూ.2 లక్షల పందెం వేస్తే రూ.20 వేలు చెల్లించాల్సిందే. కొందరు రూ.2వేలు ప్రవేశ రుసుంగా వసూలు చేస్తున్నారు. ఇదంతా అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల నిర్వహణలోనే సాగుతున్నాయని విమర్శలున్నాయి.
విచారణ చేస్తున్నాం
పెదవేగి, దెందులూరు మండలాల్లో పేకాట స్థావరాలు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని స్పందనలో వినతి ఇచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నాం. పేకాట, కోడిపందేల నిర్వహణను నిరోధించేందుకు ఎస్ఈబీ బృందాలను పంపిస్తాం.
- రాహుల్దేవ్శర్మ, ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు