logo

మిస్‌ ఇండియా యూఎస్‌ఏ రన్‌రప్‌గా సంజన

ఇటీవల అమెరికాలో జరిగిన 2022 మిస్‌ ఇండియా యూఎస్‌ఏ పోటీల్లో పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన సంజన రెండో రన్‌రప్‌గా నిలిచినట్లు

Published : 13 Aug 2022 06:18 IST

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: ఇటీవల అమెరికాలో జరిగిన 2022 మిస్‌ ఇండియా యూఎస్‌ఏ పోటీల్లో పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన సంజన రెండో రన్‌రప్‌గా నిలిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలపర్రు గ్రామానికి చెందిన చేకూరి పేర్రాజు కృష్ణవేణిల కుమారుడు, కోడలు చేకూరి రంగరాజు మధులు 20 ఏళ్ల నుంచి అమెరికాలో నివాసం ఉంటున్నారని వారి కుమార్తె సంజన మిస్‌ 2022 పోటీలలో పాల్గొని రన్‌రప్‌గా నిలిచిందన్నారు. ప్రస్తుతం సంజన ఎంఎస్‌ చదువుతున్నట్లు చెప్పారు. సంజన తనకు మేనకోడలవుతుందని ఇలపర్రు సర్పంచి దండు పద్మావతి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని