logo

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: జడ్పీ ఛైర్మన్‌

ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కృషి చేస్తున్నామని జడ్పీ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జడ్పీ ఛైర్మన్‌ ఛాంబర్‌లో ఉమ్మడి జిల్లా జడ్పీటీసీ సభ్యులు, అధికారులతో శనివారం స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించారు.

Published : 14 Aug 2022 03:51 IST


మాట్లాడుతున్న శ్రీనివాస్‌

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కృషి చేస్తున్నామని జడ్పీ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జడ్పీ ఛైర్మన్‌ ఛాంబర్‌లో ఉమ్మడి జిల్లా జడ్పీటీసీ సభ్యులు, అధికారులతో శనివారం స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించారు. మండలాలకు కేటాయించిన జడ్పీ నిధులతో తాగునీరు, రహదారులు, డ్రెయినేజీ సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం, దేవాదాయ, కార్మికశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, వ్యవసాయం, పౌరసరఫరాల తదతర శాఖల అంశాల్లో జరిగిన పురోగతిపై చర్చించారు. సీఈవో రవికుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని