logo

20-20 రొయ్య!

ఆకివీడులో హోల్‌సేల్‌ మార్కెట్‌కు శనివారం 20 కౌంట్‌ (కిలోకు 20 లోపు) రొయ్యలు రావడంతో మాంసాహార ప్రియులు ఎగబడి కొనుగోలు చేశారు.

Published : 14 Aug 2022 03:51 IST


20 కౌంట్‌ రొయ్యలు చూపుతున్న యువకుడు

ఆకివీడులో హోల్‌సేల్‌ మార్కెట్‌కు శనివారం 20 కౌంట్‌ (కిలోకు 20 లోపు) రొయ్యలు రావడంతో మాంసాహార ప్రియులు ఎగబడి కొనుగోలు చేశారు. కృష్ణా జిల్లా పెదలంక ప్రాంతానికి చెందిన రైతు చెరువు అడుగు భాగంలో పట్టుబడి చేయగా సుమారు 30 కిలోల వరకు ఈ సైజు రొయ్యలు లభ్యమయ్యాయి. అరుదుగా లభించే ఈ సైజు రొయ్యల కోసం కొనుగోలుదారులు పోటీపడ్డారు. కిలో గరిష్ఠంగా రూ.470( సగటున ఒకటి రూ.23 పైనే) పలికినట్లు వ్యాపారులు చెప్పారు.

- న్యూస్‌టుడే, ఆకివీడు (ఉండి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని