పరిశ్రమించవోయి!
ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన స్వాతంత్య్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రగతి ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన దేశంలో ఉమ్మడి పశ్చిమకు విశిష్ట స్థానం ఉంది. మహిళా విద్య, వ్యవసాయం, రవాణా, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి పథంలో పయనించింది. ఇప్పటి వరకు సాధించింది ఒక ఎత్తయితే స్వాతంత్య్ర శత వసంతాల నాటికి సాధించాల్సింది
ప్రధాన రంగాల్లో ఉమ్మడి పశ్చిమ పురోగతి
సమష్టి కృషితో మరింత అభివృద్ధి
ఈనాడు డిజిటల్, భీమవరం, న్యూస్టుడే, పాలకొల్లు
ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన స్వాతంత్య్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రగతి ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన దేశంలో ఉమ్మడి పశ్చిమకు విశిష్ట స్థానం ఉంది. మహిళా విద్య, వ్యవసాయం, రవాణా, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి పథంలో పయనించింది. ఇప్పటి వరకు సాధించింది ఒక ఎత్తయితే స్వాతంత్య్ర శత వసంతాల నాటికి సాధించాల్సింది మరెంతో మన ముందుంది. ఈ దిశగా అన్ని వర్గాలు సంకల్పిస్తూ వందేమాతర గీతాన్ని సార్థకం చేసుకునేలా పయనించాల్సి ఉంది. కొన్ని రంగాల్లో ముందంజ వేయడానికి ఇప్పట్నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల్సి ఉంది.
త్రివర్ణ శోభితం
‘ఆజాదీకా అమృత్ మహోత్సవం’ సందర్భంగా కలెక్టరేట్ను త్రివర్ణ శోభితంగా ముస్తాబు చేశారు. విద్యుత్తు దీపాలతో అలంకరించారు.
త్యాగాలను మరువొద్దు
భీమవరం పట్టణం, న్యూస్టుడే: స్వాతంత్య్ర సమరంలో ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను మరువొద్దని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. భీమవరంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ఆమెతో పాటు ఎస్పీ యు.రవిప్రకాశ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
మదినిండా మన జెండా
ఆజాదీకా అమృత్మహోత్సవ్ సందర్బంగా ఊరూవాడా తివ్రర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి.
వీరవాసరం మండలం కోరుకొల్లులో జాతీయ జెండాతో ప్రదర్శన
తణుకు అంబేడ్కర్ కూడలిలో విద్యుత్ కాంతులు
చైతన్యంతో ‘సాగు’తుండాలి
స్వాతంత్య్రం వచ్చే నాటికి ఉమ్మడి జిల్లాలో 1.2 లక్షల హెక్టార్లలో వరి సాగు చేసేవారు. ఆనకట్టల నిర్మాణం, కాలువల విస్తరణ, ఆయకట్టు స్థిరీకరణతో సాగు విస్తీర్ణం పెరిగి 2.25 లక్షల హెక్టార్లకు చేరింది. మరో 50 వేల హెక్టార్లలో కొబ్బరి, అరటి, నిమ్మ, పామాయిల్, కూరగాయలు పండిస్తున్నారు. ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకోవడంతో దిగుబడి పెరిగింది. ఇదే సమయంలో పెట్టుబడి వ్యయం కూడా పెరగడంతో గిట్టుబాటు ధర దక్కడం లేదు. పలు పథకాలు, రాయితీలు అసలైన సాగుదారులకు చేరితే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. నవ్యాంధ్ర జీవనాడి పోలవరం నిర్మాణాన్ని వేగిరం చేయాలి. మన ప్రాంతంలోనూ కొందరు సేంద్రియ పద్ధతుల్లో కొత్త వంగడాలు సాగుచేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఈ సాగును మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది.
ఊరూరా మంచినీరు
ఉమ్మడి జిల్లాలో జలవనరులు పుష్కలంగానే ఉన్నప్పటికీ తాగునీటి కాలుష్యం ఉంది. చుట్టూ నీరున్నా తాగడానికి చుక్కనీరు పనికిరాని దుస్థితి. ఉమ్మడి జిల్లాలో 8 పురపాలికలు, రెండు నగరపంచాయతీలు, ఒక కార్పొరేషన్, సుమారు వెయ్యి గ్రామాల్లో కలిపి పది లక్షల కుటుంబాల్లో దాదాపు 40 లక్షల మంది జీవిస్తున్నారు. వీరందరికి శుద్ధిచేసిన జలాలు అందివ్వగలిగితే ప్రస్తుత తరంతోపాటు భావితరాలు కూడా ఆరోగ్యంగా జీవించొచ్చు.
పెరగాలి రవాణా
రవాణా అభివృద్ధికి పర్యాయపదం లాంటిది. అనాది నుంచి ఆర్టీసీలో కూడా అనేక మార్పులు సంతరించుకున్నాయి. 1958లో ఈసేవలు 27 బస్సులతో మొదలయ్యాయి. అప్పట్లో అసలు జిల్లాలో బస్సులే లేవు. ఐదేళ్ల తరువాత జిల్లాలో మూడు బస్సులు నడిపారు. 30 ఏళ్ల క్రితం వరకూ కూడా 40 మార్గాల్లో 100 మాత్రమే తిరిగేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 454 బస్సులున్నాయి. ఇంత ప్రగతి సాధించినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా చాలా గ్రామాలకు వెళ్లటం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. ఇక రైల్వే రవాణాలోనూ అభివృద్ధి అవసరం. ఈ సేవలు విస్తృతం కావాల్సిన అవసరం ఉంది.
ప్రగతి‘దారుల్లో’
ఉమ్మడి జిల్లాలో 1960 నాటికి హైవేల పొడవు 507 కి.మీ. ఉండగా ప్రస్తుతం 1051 కి.మీలకు చేరుకుంది. ఆర్అండ్బీ రోడ్లు 3219 కి.మీ, జిల్లా ప్రధాన మార్గాలు 585 కి,మీ, గ్రామీణ రహదారులు:1,583 కి.మీ. విస్తరించటంతో రవాణా వ్యవస్థ పటిష్ఠమయింది. ఇన్ని ఉన్నా నిర్వహణ లోపాలు సమస్యగా పరిణమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రహదారుల్లో దాదాపు 70 శాతం వరకు ఛిద్రంగా ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారుల పరిస్థితి కూడా కొన్నేళ్ల నుంచి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై చొరవ చూపాల్సి ఉంది.
ఎగుమతుల రాబడి
ఉమ్మడి జిల్లాలో 1980 నుంచి ఆక్వారంగం ఊహించని రీతిలో దూసుకెళ్తుంది. శాస్త్రీయ పద్ధతుల్లో ఆక్వా సాగు చేయడం కలిసొచ్చింది. ఆక్వా ప్రాసెసింగ్, మేతల పరిశ్రమలు, శీతల గిడ్డంగులు ఏర్పాటవడంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించింది. పశ్చిమబంగ, బిహార్ వంటి రాష్ట్రాలకు నిత్యం వందలాది లారీల్లో చేపలు, రొయ్యలు ఇక్కడ్నుంచి ఎగుమతి అవుతున్నా.. వీటి ద్వారా ఆదాయం మరింత పెరగాల్సి ఉంది.
ఉపాధికి పునాది..
ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఉపాధి వనరులు బాగుండాలి. ఉమ్మడి జిల్లాలో సుమారు 10 లక్షలమంది యువత ఉన్నారు. వీరంతా ఉపాధి పొందాలంటే సరైన మార్గాన్ని ఎంచుకునేలా మార్గదర్శకం చేసేలా పాఠశాలలు, కళాశాలలు తయారుకావాలి. అంతా ఒకే రంగంపై కాకుండా వారికున్న అభిరుచితో పాటు సమాజ అవసరాలను మేరకు ఉపాధి మార్గాలు ఎంచుకునేలా ప్రోత్సహించాలి. వ్యవసాయ, వైద్య కోర్సులకు ప్రోత్సాహకాలు పెంచి ఏటా ఎక్కువమంది ఆయా రంగాల్లోకి వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది.
అతివలే ఇంటికి వెలుగు
అతివకు అందలం పశ్చిమ ప్రజల చైతన్యం, విశాల దృక్పథం కారణంగా ఆడ బిడ్డల సంఖ్య మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది. 2001లో లింగనిష్పత్తి 1000: 991 గా నమోదవగా 2011 నాటికి ప్రతి 1000: 1004కు చేరింది. ఆడ బిడ్డల అక్షరాస్యతలో 2001లో 68.99 ఉండగా, 2011 నాటికి అది 71.36 శాతానికి పెరిగింది. 2001లో పురుషుల అక్షరాస్యత శాతం 78.05 ఉండగా, 2011 నాటికి 77.92 శాతానికి పడిపోయింది. దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి