చుట్టూ నీరు.. ఆపై చీకటి!
చుట్టూ నీరు.. ఆపై కటిక చీకటి.. గోడు చెప్పుకునేందుకు ఎవరూ రాని వైనం.. ఇదీ నెల రోజులుగా విలీన మండలం వేలేరుపాడులోని 47 గ్రామాల్లోని వరద బాధితుల దుస్థితి. గత నెల 10న ప్రారంభమైన వరద ప్రవాహం మహోగ్రరూపం దాల్చి వేలాది మందిని నిలువ నీడలేకుండా చేసింది. 15 రోజుల క్రితం తగ్గుముఖం పట్టి సాధారణ
నెల రోజులుగా బాధితుల పాట్లు
నిత్యావసరాల కోసం పడవలో వస్తున్న చిగురుమామిడి గ్రామస్థులు
వేలేరుపాడు, న్యూస్టుడే: చుట్టూ నీరు.. ఆపై కటిక చీకటి.. గోడు చెప్పుకునేందుకు ఎవరూ రాని వైనం.. ఇదీ నెల రోజులుగా విలీన మండలం వేలేరుపాడులోని 47 గ్రామాల్లోని వరద బాధితుల దుస్థితి. గత నెల 10న ప్రారంభమైన వరద ప్రవాహం మహోగ్రరూపం దాల్చి వేలాది మందిని నిలువ నీడలేకుండా చేసింది. 15 రోజుల క్రితం తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటుండగా, మళ్లీ ఈ నెల 9 నుంచి వరద అంతకంతకూ పెరుగుతూ భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటి 52 అడుగులకు చేరుకుంది. మండలంలోని కొయిదా, కట్కూరు, నార్లవరం, తిరుమలాపురం, తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము, రుద్రంకోట పంచాయతీల్లోని 5600 కుటుంబాల వారు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. గత నెలలో వచ్చిన వరదకు బియ్యం, ఇతర నిత్యావసరాలు అందించిన ప్రభుత్వం రెండో దఫా బాధితులను కనీసం పట్టించుకోకపోవడంతో గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక మిన్నకుండి పోతున్నారు.
బాహ్యప్రపంచానికి దూరంగా..
యడవల్లి-బోళ్లపల్లి గ్రామాల మధ్యలో గల ఎద్దువాగు వంతెన భద్రాచలం వద్ద వరద 40 అడుగులకు చేరగానే నీట మునుగుతోంది. కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని 17 గిరిజన గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని వంతెన మునిగిపోతుండడంతో అక్కడి గిరిజనులు వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టేంత వరకు బయటకు వచ్చే పరిస్థితి లేక బాహ్య ప్రపంచానికి దూరంగా కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటుంది. దీనికి తోడు విద్యుత్తు స్తంభాలు, పరివర్తకాలు తరచూ నీట మునగడంతో సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో అక్కడి గిరిజనులు వరద తగ్గేంత వరకు అంధకారంలో మగ్గుతూ దోమకాటుకు గురై జ్వరాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
గుడారాల్లో బిక్కుబిక్కుమంటూ..
రుద్రంకోట, తిరుమలాపురం, తూర్పుమెట్ట, నార్లవరం, చిగురుమామిడి గ్రామాల్లోకి నీరు వచ్చి చేరడంతో సమీపంలోని గుట్టలపైకి చేరి గుడారాల్లో జీవనం సాగిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా వచ్చిన వరదతో ప్రభుత్వం ఇచ్చిన టార్పాలిన్లతో గుడారాలు ఏర్పాటు చేసుకుని పిల్లా పాపలతో కంటిమీద కునుకులేని రాత్రులు గడుపుతున్నారు. వీరికి నిత్యావసరాల సంగతి దేవుడెరుగు. కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయకపోవడంతో వరద నీటితోనే గొంతులు తడుపుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.