తలదాచుకుందామని వస్తే.. తరమాలని చూస్తున్నారు!
చల్లావారిగూడెం పునరావాస కాలనీలో తలదాచుకుంటున్న రుద్రంకోట నిర్వాసితులను సోమవారం లోగా ఖాళీ చేయాలని కొందరు ఒత్తిడి చేయడం వివాదంగా మారింది. బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందినా ఉండడానికి వీలు లేదనడంతో వారంతా దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి సుమారు
రుద్రంకోట నిర్వాసితుల ఆవేదన
జంగారెడ్డిగూడెం, గ్రామీణ, న్యూస్టడే: చల్లావారిగూడెం పునరావాస కాలనీలో తలదాచుకుంటున్న రుద్రంకోట నిర్వాసితులను సోమవారం లోగా ఖాళీ చేయాలని కొందరు ఒత్తిడి చేయడం వివాదంగా మారింది. బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందినా ఉండడానికి వీలు లేదనడంతో వారంతా దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి సుమారు 15 కుటుంబాలు కట్కూరు పునరావాస కాలనీలో ఉంటున్న వారి బంధువుల ఇళ్లకు సామగ్రి పాడవకుండా దాచుకునేందుకు వచ్చారు. మళ్లీ వరద రావడంతో ఇక్కడే ఉండిపోయారు. పైగా రుద్రంకోట నిర్వాసితులకు ఇక్కడే పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. గుత్తేదారులే వారికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కేవలం నీళ్లు ఇవ్వడం భారమనే ఉద్దేశంతో మమ్మల్ని వెళ్లిపోవాలంటున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. పోలీసులతో గెంటేస్తామని మరీ బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆర్డీవో ఝాన్సీ రాణి వద్ద ప్రస్తావించగా.. నిర్వాసితులు అక్కడ ఉండొచ్చని, గుత్తేదారుతో మాట్లాడి ఇబ్బందుల్లేకుండా చేస్తామని తెలిపారు.
ప్రాణభయంతో వచ్చాం..
‘నిలువ నీడ లేక ప్రాణ భయంతో పిల్లా పాపలతో ఇక్కడకు చేరాం. నిర్వాసితులమైన మాకు సాయం చేయాల్సింది పోయి ఇక్కడ నుంచి పొమ్మంటున్నారు. ఇదేమి తీరు. తహశీల్దారు నుంచి లేఖ తెమ్మంటున్నారు’ అని దారా కుమార్, రాములు తెలిపారు.
నాలుగు రోజులు గడువు అడిగినా..
‘నాలుగు రోజులు గడువు అడిగాం. అయినా ఖాళీ చేయాలంటున్నారు. నడుము లోతు నీళ్లు ఉన్న గ్రామం నుంచి బతుకు జీవుడా అంటూ బంధువుల ఇళ్లకు వచ్చాం. కేవలం మంచినీళ్లు ఇవ్వాల్సి వస్తుందని ఖాళీ చేయమంటే ఎలా. నీళ్లు సరఫరా చేయకపోయినా ఫర్వాలేదన్నా వినడం లేదు. జులుం ప్రదర్శిస్తున్నారు’ అని యడ్ల సావిత్రి, కుచ్చలపాటి చిన్నారి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..