పశ్చిమ తీరాన ఉద్యమ కెరటం
జాతీయోద్యమ స్ఫూర్తితో పశ్చిమలో రగిలిన స్వాతంత్య్ర కాంక్ష అది సిద్ధించే వరకు కొనసాగింది. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో, సాంకేతికత అంటే తెలియని సమయంలోనే నాయకులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగారు. ఈ ఉద్యమంలో పురుషులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
భీమవరం పట్టణం, న్యూస్టుడే:
భీమవరంలో ప్రకాశం చౌక్ కూడలి
జాతీయోద్యమ స్ఫూర్తితో పశ్చిమలో రగిలిన స్వాతంత్య్ర కాంక్ష అది సిద్ధించే వరకు కొనసాగింది. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో, సాంకేతికత అంటే తెలియని సమయంలోనే నాయకులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగారు. ఈ ఉద్యమంలో పురుషులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
1907 ఏప్రిల్19న..
1907 ఏప్రిల్ 19న బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించి విద్యాధిక యువతలో చైతన్యాన్ని రగిలించారు. ఏప్రిల్ 24న భీమవరం చేరుకున్న ఆయన వెంట కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు, బోడి నారాయణరావు ఉన్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం పాలకోడేరు మండలం గరగపర్రులో పాలకోడేటి సుబ్బారావు ఇంట్లో బస చేశారు. సుబ్బారావు బావమరిది నండూరి జానకిరామయ్య రాజమండ్రి వాసి. ఆయన ద్వారానే బిపిన్ పర్యటన భీమవరంలో ఏర్పాటు చేశారు. భీమవరం తాలూకాలో వందేమాతరం ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చిన ఘనత బిపిన్చంద్రపాల్కే దక్కుతుంది.
పాలకొల్లులో..
క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో పాలకొల్లు పట్టణం గర్జించింది. ఆంగ్లేయులు దేశం వదిలివెళ్లాలని 1942లో అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ఛైర్మన్గా, కలగ గన్నేశ్వరరావు వైస్ఛైర్మన్గా ఉన్న పాలకవర్గం తీర్మానం చేసింది. ఆగస్టు 14న విద్యాసంస్థలను మూసివేసి ఉద్యమంలోకి దిగడంతో బ్రిటిష్ ప్రభుత్వం కౌన్సిల్ను రద్దు చేసి ప్రత్యేకాధికారిని నియమించింది. 17న పురపాలక కార్యాలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించగా దాట్ల సీతారామరాజు ప్రసంగంతో పాలకొల్లు వాసులు రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నారు.
ఎందరో మహానుభావులు
* అలనాడు ఉద్యమంలో పాల్గొన్న వారికి భోజన ఏర్పాట్లను భీమవరం కర్ణాల సత్రంలో నిర్వహించే కోమల విలాస్ యజమాని ఆకెళ్ల పార్థసారథి చేసేవారు. 1942లో క్విట్ఇండియా ఉద్యమ సమయంలో గునుపూడికి చెందిన కోటమర్తి కనకమ్మ బ్రిటిష్వారిని అడ్డుకున్న వీర వనితగా పేరొందారు.
* ఉద్యమ కాలంలో ఈ ప్రాంతంలో సప్తరుషులుగా పేరొందిన అడవి బాపిరాజు, సత్యవోలు సుబ్రహ్మణ్య, వేమూరి హనుమంతరావు, తనికెళ్ల చలపతి, పాలకోడేటి సత్యనారాయణశర్మ, ముష్టి సుబ్రహ్మణ్యం, తటవర్తి కృష్ణమూర్తిలు స్వాతంత్య్ర కోసం అహర్నిశలు శ్రమించారు.
* భీమవరానికి చెందిన షేక్ అలీ సాహెబ్ 1930 నుంచి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలపాటు కారాగార శిక్షకు గురయ్యారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో ఆయన నాలుగేళ్లపాటు కారాగార శిక్ష, కొరడా దెబ్బల శిక్ష అనుభవించారు.
టంగుటూరి ప్రకాశంతో నాటి స్వాతంత్రోద్యమకారులు
1909లో కృష్ణా మండల సభ
వందేమాతరం ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజుల్లో 1909లో కృష్ణామండల సభ పేరుతో భీమవరంలో మహాసభ నిర్వహించారు. ఆంగ్లేయులకు పన్నులు కట్టకూడదని ఈ సమావేశం పేర్కొంది. ఈ సభ నిర్వహణలో నాటి కోపల్లె కరణం కాళ్లకూరి నరసింహం పంతులు ప్రముఖపాత్ర వహించారు. ముగింపు సభలో ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు సతీసమేతంగా పాల్గొని జాతీయభావాన్ని వివరించారు. మూడురోజులు జరిగిన ఈ సభలు ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.
శిక్షకు గురై..
1907లో రాజమండ్రిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వంలో వందేమాతరం ఉద్యమం చేపట్టగా అప్పటి కళాశాల ప్రధానాచార్యుడు మార్క్హంటర్ 138 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 23 మంది ఉన్నారు. వీరిలో భీమవరం పట్టణానికి చెందిన జోస్యుల రామకృష్ణయ్య, పంగిమర్రి వెంకటనరసింహం, వీరవాసరం గ్రామానికి చెందిన కేశవరపు కామరాజు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’