logo

అత్తింటి వేధింపులతో వివాహిత బలవన్మరణం

ఉండి మండలం చిలుకూరులో ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉండి ఎస్సై గంగాధరరావు కథనం ప్రకారం.. చిలుకూరు వాసి బద్ది హరి సత్యనారాయణకు అనకాపల్లి జిల్లా మోటూరుపాలెం గ్రామానికి చెందిన సునీతకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. సునీత ఆదివారం

Published : 15 Aug 2022 04:41 IST

సునీత (పాత చిత్రం)

ఉండి, న్యూస్‌టుడే:  ఉండి మండలం చిలుకూరులో ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉండి ఎస్సై గంగాధరరావు కథనం ప్రకారం.. చిలుకూరు వాసి బద్ది హరి సత్యనారాయణకు అనకాపల్లి జిల్లా మోటూరుపాలెం గ్రామానికి చెందిన సునీతకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. సునీత ఆదివారం ఇంటి వద్ద షెడ్డులో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అదనపు కట్నం తీసుకురావాలని భర్త హరి సత్యనారాయణ, అత్త కృష్ణవేణి, మామ తాతారావు, ఆడపడుచు దుర్గాభవాని కలిసి వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సునీత తండ్రి నీరుకొండ నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని