జెండా స్తూపం నిర్మాణాన్ని అడ్డుకోవడం దుర్మార్గం : పితాని
మార్టేరు సెంటర్లో జాతీయ జెండా స్తూపం నిర్మాణాన్ని రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడం అత్యంత దారుణమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.
జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని
మార్టేరు(పెనుమంట్ర), న్యూస్టుడే: మార్టేరు సెంటర్లో జాతీయ జెండా స్తూపం నిర్మాణాన్ని రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడం అత్యంత దారుణమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సోమవారం తెదేపా ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్టేరులో జాతీయ జెండాను ఆవిష్కరించిన పితాని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహిస్తూ వచ్చామన్నారు. స్తూపం నిర్మాణానికి మాట ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే వద్దన్నారని చెప్పడం సరికాదన్నారు. రాజకీయ పార్టీ జెండా స్తూపం అయితే అడ్డుకున్నా తప్పులేదన్నారు. భారత జాతి గౌరవాన్ని పెంచే జాతీయ జెండా ఎగురవేసే ప్రయత్నానికి మోకాలడ్డు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. ప్రొటోకాల్కు విరుద్ధంగా ఆచంట ఎంపీపీని కాదని అక్కడ జెండా ఎగరవేసే ప్రయత్నం చేశారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులకు ఆయా స్థాయిల్లో జెండా ఎగరవేసే అధికారం ఉంటుందన్నారు. అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యం అవహేళన, ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..