కార్పొరేషన్లో అవకతవకలపై విచారణ
‘ఏలూరు కార్పొరేషన్లో కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాం.. అర్హులందరికీ వరద నష్టపరిహారం ఇస్తున్నాం’ అని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
అవినీతి జరిగితే చర్యలు తీసుకుంటాం
బడుల విలీన ప్రక్రియలో సమస్యలు లేవు
పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యాచరణ
‘ఈనాడు’ ముఖాముఖిలో కలెక్టర్
ఈనాడు డిజిటల్, ఏలూరు
‘ఏలూరు కార్పొరేషన్లో కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాం.. అర్హులందరికీ వరద నష్టపరిహారం ఇస్తున్నాం’ అని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. పాఠశాలల విలీన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లాలో పారిశుద్ధ్యం సమస్యలు, ధాన్యం బకాయిల చెల్లింపులు తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు’ ముఖాముఖీలో వివరించారు.
ఈనాడు: ఏలూరు కార్పొరేషన్లో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై చర్యలు ఏమిటి?
కలెక్టర్: అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై జేసీని విచారణాధికారిగా నియమించాం. అన్ని కోణాల్లో విచారించారు. అవినీతి జరిగిందని నిరూపణ అయితే చర్యలు తీసుకుంటాం.
వరద నష్టపరిహారం విషయంలో చాలా మంది అర్హుల పేర్లు గలం్లతయినట్లు ఆరోపణలున్నాయి.?
జాబితాను పారదర్శకంగా తయారు చేశాం. ఒక్క గ్రామంలో సమస్య వచ్చింది. ప్రత్యేక బృందాలతో పునఃపరిశీలన చేయించాం. ఒకటి, రెండు శాతం మందికి అర్హత ఉన్నా పేర్లు గల్లంతయ్యాయని తెలిసింది. వారి వివరాలు మళ్లీ నమోదు చేశాం. భవనాల్లోకి నీరు వచ్చిన వారు కూడా నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు. దాని వల్లే ఈ ఆరోపణలు వచ్చి ఉండొచ్చు.. నష్టం జరిగితేనే నిబంధనల ప్రకారం పరిహారం ఇస్తాం.'
పాఠశాలల విలీన ప్రక్రియ సక్రమంగా జరగలేదని.. సమస్యలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.?
ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. తల్లిదండ్రుల కమిటీ, ఉపాధ్యాయు లతో స్వయంగా నేనే వీడియో సమావేశం ద్వారా సమస్యలు తెలుసుకున్నాను. 43 పాఠశాలల్లో సమస్యలు ఉన్నట్లు తెలిసింది. అందులో 22 చోట్ల నిర్ధారించుకుని మ్యాపింగ్ నుంచి తొలగించాం. ఎక్కడైనా వాస్తవంగా సమస్యలుంటే పరిష్కరిస్తాం. విలీన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేస్తున్నాం.
జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు
క్షేత్రస్థాయిలో అక్కడక్కడా సమస్యలున్నట్లు నా దృష్టికి వచ్చింది. సిబ్బంది కొరత కూడా ఉంది. పారిశుద్ధ్య నిర్వహణలో కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నాం పుర, నగరపాలక అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. చర్చించి పరిష్కారానికి కృషి చేస్తాను.
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. పరిష్కారం ఏమిటి.
అప్రోచ్ రోడ్లు లేక నిర్మాణ సామగ్రి తీసుకువెళ్లటంలో సమస్యలున్న విషయం వాస్తవమే. ఇప్పటికే గ్రావెల్ రహదారులు ఉన్నాయి. లోడ్ లారీలు ప్రయాణించటంతో గుంతలు పడి వర్షాలకు ఇబ్బంది అవుతోంది. జిల్లావ్యాప్తంగా లేఅవుట్లలో రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. తాగునీరు, విద్యుత్తు, డ్రెయినేజీ వ్యవస్థ కూడా 50 శాతం నిర్మాణాలు పూర్తైన వెంటనే ఏర్పాటు చేస్తాం.
ఖరీఫ్ మొదలై చాలా రోజులవుతున్నా.. రబీ ధాన్యం నగదు రైతులకు ఇంకా జమ కాలేదు. పరిష్కారం ఏమిటి
రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. జిల్లాలో 4 వేల మంది రైతులకు ఇంకా రూ.130 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. నగదు విడుదల కాగానే వారి ఖాతాల్లోకి నేరుగా జమవుతాయి. త్వరలోనే నగదు వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ స్థానానికి ఏడు నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 దాఖలయ్యాయి. -
అడిగితే కేసుల.. వేధింపులా
[ 24-04-2024]
‘ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. వేతనాలు పెంచుతా’ అంటూ గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి తుంగలో తొక్కారు. -
అన్నీ గాలి కబుర్లే..
[ 24-04-2024]
ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. -
ఊడుతున్న ఫ్యాను రెక్కలు
[ 24-04-2024]
అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఒత్తిళ్లకు కదిలి.. అయిష్టంగా వదిలి
[ 24-04-2024]
అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు. -
హామీలపై జగన్ పార్టీని నిలదీయండి
[ 24-04-2024]
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
బొబ్బిలి వంతెన బోరుమంటోంది!
[ 24-04-2024]
గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
ఏదీ ‘మంచి’గా ఇవ్వ‘నీ’య‘రు’
[ 24-04-2024]
తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. -
జోరుగా నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల సమర్పణ కొనసాగుతోంది. మంగళవారం ఏలూరు ఎంపీ స్థానానికి ముగ్గురు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 26 మంది దాఖలు చేశారు. భీమవరంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అందజేశారు. -
వీల్ఛైర్ కావాలా? ‘సాక్ష్యం’లో దరఖాస్తు చేయండి
[ 24-04-2024]
మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్ఛైౖర్ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్లో అల్లూరి శరత్చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది. -
అసలు కోడ్ ఉందా?
[ 24-04-2024]
పాలకొల్లులో ఆర్వో కార్యాలయం పక్కనే ఉన్న భవనంపై ఉన్న సీఎం జగన్ సిద్ధం ఫ్లెక్సీ ఇప్పటికీ తొలగించలేదు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఫ్లెక్సీని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. -
వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలు
[ 24-04-2024]
వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఆరోపించారు. మంగళవారం కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మాటల మేడలు కట్టేసి.. స్మార్ట్గా చేతులెత్తేసి!
[ 24-04-2024]
మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. -
మంచి చేస్తానని ముంచేసి..
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు