ఆజాదీకా అమృతోత్సాహం
పునర్విభజన అనంతరం ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో స్వాతంత్య్ర వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. కలెక్టరేట్కు ఎడమవైపున ఉన్న ఖాళీ స్థలాన్ని వేడుకల కోసం సుందరంగా తీర్చిదిద్దారు. అప్పటికప్పుడు తాత్కాలిక మార్గాలు వేశారు.
భీమవరంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
జాతీయ పతాకావిష్కరణ అనంతరం మువ్వన్నెల బెలూన్లను ఎగురవేస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాజా, కలెక్టర్ ప్రశాంతి
భీమవరం పట్టణం, న్యూస్టుడే: పునర్విభజన అనంతరం ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో స్వాతంత్య్ర వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. కలెక్టరేట్కు ఎడమవైపున ఉన్న ఖాళీ స్థలాన్ని వేడుకల కోసం సుందరంగా తీర్చిదిద్దారు. అప్పటికప్పుడు తాత్కాలిక మార్గాలు వేశారు. ప్రత్యేక టెంట్లు, మూడు రంగుల జెండాలు, పూలతో ప్రాంగణాన్ని అలంకరించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వేడుకలు మధ్యాహ్నం 1.30 వరకు నిరాటంకంగా కొనసాగాయి. కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దాడిశెట్టి రాజా, ఎస్పీ యు.రవిప్రకాశ్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి దాడిశెట్ట రాజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమ నేతల కుటుంబ సభ్యులను, సమాజ సేవకులను సత్కరించారు. క్రీడల్లో రాణిస్తున్న యువతకు ప్రోత్సాహకంగా జ్ఞాపికలు అందించారు. వివిధ శాఖలకు చెందిన వందల మంది అధికారులు, సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సన్మానించడంతో ఉద్యోగుల మోములో ఆనందం వెల్లివిరిసింది.
గౌరవ వందనం సమర్పిస్తూ పోలీసుల కవాతు
ఆకట్టుకున్న విన్యాసాలు.. జిల్లాలోని పలు విద్యా సంస్థల విద్యార్థుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మల్లఖంబ్, రోప్ మల్లఖంబ్ విన్యాసాలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల బృందం బ్యాండ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకలను నేరుగా వీక్షించేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు, ఉద్యోగులు కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. యువత ప్రాంగణంలో స్వీయచిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు.
ప్రాంగణంలో చిన్నారుల సందడి
నాయకుల వేషధారణలో విద్యార్థుల ప్రదర్శన
మహనీయుల స్మృతిలో..
సత్కారం పొందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు
భీమవరం పట్టణం, న్యూస్టుడే: కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పస్తుల సాగరం, భూపతిరాజు సుబ్బతాతరాజు, షేక్ అలీ సాహెబ్, కోటమర్తి కనకమహాలక్ష్మి, బర్మా కేశవరావు, తటవర్తి కృష్ణమూర్తి, తటవర్తి సుబ్బారావు, అయ్యగారి అమ్మిరాజు, గరగ వెంకటరమణమ్మ, ఉద్దరాజు వెంకట్రాజు, అడవి బాపిరాజు, ప్రత్తి శేషయ్య, పాలకోడేటి సత్యనారాయణశర్మ, గొట్టుముక్కల రామచంద్రరాజు కుటుంబ సభ్యులను సత్కరించారు.
మువ్వన్నెల నీడలో ఆకివీడు
ఆకివీడు, న్యూస్టుడే: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకివీడులో సోమవారం వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. బాలుర ఉన్నత పాఠశాల వద్ద నుంచి గుమ్ములూరు కూడలి వద్ద పోలీస్స్టేషన్ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో లయన్స్క్లబ్ సభ్యులు, వ్యాపారులు, విద్యార్థులు, ప్రజలు దాదాపు 5 వేల మంది దేశభక్తి గీతాలు ఆలపిస్తూ.. భారత్ మాతకీ జై నినాదాలతో ముందుకు సాగారు.
విద్యా శాఖ శకటానికి ప్రథమ స్థానం
విద్యా శాఖ శకటం ప్రథమ స్థానంలో నిలవగా డీఈవో వెంకటరమణ బహుమతి అందుకున్నారు. పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల శకటాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. డ్వామా శకటానికి ప్రత్యేక బహుమతి దక్కింది.
స్టాళ్ల పరిశీలన: చేనేత, సమాచార, వ్యవసాయ, ఉద్యాన, పోలీసు, పరిశ్రమలు, డీఆర్డీఏ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాశ్ తదితరులు పరిశీలించారు. సమాచార శాఖ స్టాల్లో అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలు, నాయకుల అరుదైన చిత్రాలను ప్రదర్శించారు.
సంక్షేమ పథకాలు చేరువ
ప్రసంగిస్తున్న రాజా
భీమవరం పట్టణం, వీరవాసరం, న్యూస్టుడే: అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేశామని జిల్లా ఇన్ఛార్జి, ఆర్అండ్బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) అన్నారు. సోమవారం భీమవరంలోని కలెక్టరేట్ ప్రాంగణం వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. నవరత్నాలను కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ అందిస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం ద్వారా జిల్లాలో 1.4 లక్షల మందికి రూ.15 వేల చొప్పున రూ.221 కోట్లు అందించామన్నారు. మన బడి- నాడు నేడులో 727 పాఠశాలల్లో రూ.262 కోట్లతో మౌలిక వసతులు కల్పించామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసేలా 515 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ సేవలు అందేలా 8,660 వాలంటీర్లను నియమించామన్నారు. జిల్లాలో 2.18 లక్షల మందికిపైగా పింఛన్లు ఇస్తున్నామన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాశ్తో కలిసి శాంతి కపోతాలను, రంగుల బెలూన్లను ఆకాశంలోకి విడిచిపెట్టారు.
పోల్ మల్లఖంబ్లో క్రీడాకారుల విన్యాసం
రింగులతో యువతుల సందడి
కనకదుర్గలా అభినయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ స్థానానికి ఏడు నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 దాఖలయ్యాయి. -
అడిగితే కేసుల.. వేధింపులా
[ 24-04-2024]
‘ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. వేతనాలు పెంచుతా’ అంటూ గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి తుంగలో తొక్కారు. -
అన్నీ గాలి కబుర్లే..
[ 24-04-2024]
ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. -
ఊడుతున్న ఫ్యాను రెక్కలు
[ 24-04-2024]
అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఒత్తిళ్లకు కదిలి.. అయిష్టంగా వదిలి
[ 24-04-2024]
అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు. -
హామీలపై జగన్ పార్టీని నిలదీయండి
[ 24-04-2024]
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
బొబ్బిలి వంతెన బోరుమంటోంది!
[ 24-04-2024]
గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
ఏదీ ‘మంచి’గా ఇవ్వ‘నీ’య‘రు’
[ 24-04-2024]
తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. -
జోరుగా నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల సమర్పణ కొనసాగుతోంది. మంగళవారం ఏలూరు ఎంపీ స్థానానికి ముగ్గురు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 26 మంది దాఖలు చేశారు. భీమవరంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అందజేశారు. -
వీల్ఛైర్ కావాలా? ‘సాక్ష్యం’లో దరఖాస్తు చేయండి
[ 24-04-2024]
మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్ఛైౖర్ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్లో అల్లూరి శరత్చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది. -
అసలు కోడ్ ఉందా?
[ 24-04-2024]
పాలకొల్లులో ఆర్వో కార్యాలయం పక్కనే ఉన్న భవనంపై ఉన్న సీఎం జగన్ సిద్ధం ఫ్లెక్సీ ఇప్పటికీ తొలగించలేదు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఫ్లెక్సీని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. -
వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలు
[ 24-04-2024]
వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఆరోపించారు. మంగళవారం కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మాటల మేడలు కట్టేసి.. స్మార్ట్గా చేతులెత్తేసి!
[ 24-04-2024]
మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. -
మంచి చేస్తానని ముంచేసి..
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్