లేదంటే..రాదంతే
పెరిగిన ఎరువుల ధరలు, అప్పుల బాధలు, ప్రకృతి వైపరీత్యాలు.. మరోపక్క గిట్టుబాటు లేని ధరలు.. ఇలా ప్రతికూల పరిస్థితులన్నీ అన్నదాత వెన్ను విరుస్తుంటే.. గోరుచుట్టుపై రోకటి పోటులా కొందరు రెవెన్యూ అధికారులు రాబందుల్లా పీక్కు తింటున్నారు.
ముడుపు కడితేనే పాసుపుస్తకం
ఆగని వీఆర్వోల దందా
పెరిగిన ఎరువుల ధరలు, అప్పుల బాధలు, ప్రకృతి వైపరీత్యాలు.. మరోపక్క గిట్టుబాటు లేని ధరలు.. ఇలా ప్రతికూల పరిస్థితులన్నీ అన్నదాత వెన్ను విరుస్తుంటే.. గోరుచుట్టుపై రోకటి పోటులా కొందరు రెవెన్యూ అధికారులు రాబందుల్లా పీక్కు తింటున్నారు. 1బీ, పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో వసూళ్ల పర్వానికి తెర తీస్తున్నారు.ఎకరానికి పాస్పుస్తకం ఇప్పించాలంటే రూ.3 వేలు-రూ.10 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు.చాలా చోట్ల మండల స్థాయి అధికారులకు కూడా ఇందులో వాటాలుంటున్నాయి. ఈనాడు డిజిటల్, భీమవరం, న్యూస్టుడే-భీమవరం అర్బన్, పెనుమంట్ర, చాట్రాయి
విధానం ఇది
పట్టాదారు పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోగా రెవెన్యూ సిబ్బంది నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల వరకు దరఖాస్తులో మార్పులు, తప్పులు సరిదిద్దటం, ఇతర అభ్యంతరాలు స్వీకరించాలి. మరో నాలుగు రోజుల్లో వీఆర్వో, తహశీల్దారు పరిశీలించాలి. ఈ ప్రక్రియ మొత్తం 21 రోజుల్లో పూర్తి చేయాలి. అన్నీ సవ్యంగా ఉంటే 1బీ ఇవ్వాలి. వీలైనంత త్వరగా రైతు దరఖాస్తులో ఇచ్చిన చిరునామాకు పాస్పుస్తకం పోస్ట్ద్వారా పంపాలి. క్షేత్రస్థాయిలో అసలు విధానంపై రైతులకు అవగాహన లేదు. అధికారులు కల్పించరు కూడా. దీని మంజూరులో వీఆర్వోలే దళారుల పాత్ర పోషిస్తున్నారు. దరఖాస్తు పై స్థాయికి వెళ్లాలంటే వీరి వాటా చెల్లించాల్సిందే. ఈ వాటాలు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. కొందరు రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటే..అత్యవసరంగా పాసుపుస్తకం కావాలంటే రూ.5 వేలు-రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు. ముడుపు కడితేనే పని జరుగుతుందని తేల్చి చెబుతున్నారు.
రైతుల అవసరాలను అలుసుగా
పాస్పుస్తకాలను ప్రామాణికంగా తీసుకునే బ్యాంకర్లు పంట రుణాల మొదలు దీర్ఘకాలిక రుణాల వరకూ మంజూరు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన పొలాలను తమ పూర్వీకుల పేరు నుంచి తమ పేరుకు మార్చుకోవడానికి రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా రైతుల అవసరాలను అధికారులు ఆసరాగా తీసుకుని పావులు కదుపుతున్నారు. డబ్బులు ఇవ్వని వారి దరఖాస్తు విషయంలో ఏదో మెలిక పెట్టి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. పలుకుబడి ఉన్నవారికి వెంటనే పని జరిగిపోతున్నా.. సాధారణ ప్రజలకు మాత్రం కాలయాపనే మిగులుతోంది.
నగదు డిమాండ్ చేస్తే చర్యలు
దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలి. నగదు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి. చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఎవరికీ నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. డిమాండ్ చేస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటాం.-అరుణ్బాబు, జేసీ ఏలూరు, -జె.వెంకటమురళి, జేసీ పశ్చిమగోదావరి
* పెనుమంట్ర మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో ఓ రైతు తన కుమారుడు, కోడలుకు చెందిన భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకానికి దరఖాస్తు చేశారు. అన్నీ సక్రమంగా ఉన్నా మాకేమిటి అంటూ స్థానిక రెవెన్యూ ఉద్యోగి అడిగారు. రూ.రెండు వేలు చేతిలో పెట్టగా తిరస్కరించారు. పాసు పుస్తకం వచ్చాక మరికొంత ఇస్తానులే అంటే... అలా కుదరదు పుస్తకం పోస్ట్లో వస్తుంది అంటూ మరో నాలుగు వేలు డిమాండ్ చేశారు. చివరకు మరో రెండు వేలు ఇస్తే గాని పని ముందుకు సాగలేదు.
* కొన్ని నెలల కిందట చాట్రాయి మండలం చీపురుగూడెంకి చెందిన కోటేశ్వరరావు అనే రైతు వారసత్వంగా వచ్చిన పొలాలకు పాస్పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్నీ సరిగ్గా ఉన్నా వీఆర్వో పట్టించుకోక పోవటంతో దాదాపు ఐదారు నెలలు కార్యాలయం చుట్టూ తిరిగారు. విసిగిపోయిన ఆ రైతు వీఆర్వోపై దాడి చేశారు. తన దగ్గర డబ్బులు తీసుకుని కూడా పని చేయలేదని ఆరోపించారు. వీఆర్వో ఫిర్యాదుతో స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు.
* ఏలూరు విద్యానగర్కు చెందిన హరి ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయుడు. ఉద్యోగ విరమణ సమయంలో వచ్చిన నగదుతో భీమడోలు మండలంలో రెండెకరాల పొలం కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తికాగానే పాస్ పుస్తకానికి దరఖాస్తు చేశారు. నాలుగు నెలలు గడిచినా అక్కడి వీఆర్వో మాత్రం ఇవ్వాళ రేపు అంటూ వాయిదాలు వేస్తున్నారు. దీంతో విషయం అర్థం చేసుకుని రూ.4 వేలు సమర్పించుకున్నారు. వారంలోగా పాస్ పుస్తకం వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు