అయ్యయ్యో ఉల్లి!
తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఆలస్యంగా ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏటా కర్నూలు ఉల్లి సీజన్ జులైలో ప్రారంభమై, ఆగస్టులో ఊపందుకునేది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులతో మార్కెట్ రద్దీగా ఉండేది. కానీ ఈ ఏడాది ఆలస్యంగా సీజన్ ప్రారంభమెంది. ఇప్పటికే వందల టన్నుల వ్యాపారం జరగాల్సి ఉన్నా...ఈ ఏడాది ఇంకా పుంజుకోలేదు.
మందగమనంలో వ్యాపారం
తాడేపల్లిగూడెం మార్కెట్కు దిగుమతవుతున్న ఉల్లి
తాడేపల్లిగూడెం, న్యూస్టుడే: తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఆలస్యంగా ఉల్లి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏటా కర్నూలు ఉల్లి సీజన్ జులైలో ప్రారంభమై, ఆగస్టులో ఊపందుకునేది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులతో మార్కెట్ రద్దీగా ఉండేది. కానీ ఈ ఏడాది ఆలస్యంగా సీజన్ ప్రారంభమెంది. ఇప్పటికే వందల టన్నుల వ్యాపారం జరగాల్సి ఉన్నా...ఈ ఏడాది ఇంకా పుంజుకోలేదు. ఏటా ఈ నెలలో కనీసం రోజుకు 70 నుంచి 90 లారీల వరకూ దిగుమతయ్యేవి. పంట తక్కువగా ఉండటంతోపాటు నాసిరకం రావడంతో ఇక్కడ వ్యాపారులేకాదు..ఒడిశా, పశ్చిమ బంగ నుంచి వ్యాపారులు కొనేందుకు అంతగా ముందుకు రావడం లేదు. దీంతో దిగుమతైన ఉల్లి వేలం వేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. శుక్రవారం దిగుమతైన ఉల్లికి మధ్యాహ్నం అయినా వేలం పూర్తి కాలేదు. నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లి అయితే గంటలోపే పూర్తయ్యేది.
ప్రారంభ ధర రూ.300
కర్నూలు ఉల్లి క్వింటా రూ.300 నుంచి ప్రారంభమైంది. నాణ్యతను బట్టి రూ.1400 వరకు వేలంలో పలికింది. నాసిరకమే ఎక్కువగా రావడంతో ధర పడిపోయింది. మహారాష్ట్ర ఉల్లి క్వింటా రూ.600 నుంచి రూ.1600 వరకూ వెళ్లింది. బంగ్లాదేశ్కు కూడా ఇక్కడి నుంచే గతంలో ఎగుమతి చేసేవారు. కానీ చైనా నుంచి తక్కువ ధరకే లభిస్తుండటంతో అక్కడి వ్యాపారులు దిగుమతులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలతో ఉల్లి వాణిజ్యం భారీగా దెబ్బతింది. ఏటా 500 నుంచి వెయ్యి టన్నుల వరకు ఆయా దేశాలకు ఎగుమతులు చేసేవారు. ఈ ఏడాది మాత్రం 70 శాతం తగ్గిపోయింది.
కిసాన్ రైళ్లలో ఎగుమతులేవీ
కిసాన్ రైళ్లను 50 శాతం తక్కువ ధరకే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వేశాఖ అనుమతిచ్చింది. లారీ ఉల్లిని నాగాలాండ్ వంటి రాష్ట్రానికి రవాణా చేయాలంటే రూ.80 వేల వరకూ కిరాయి ఉండేది. ఒక్కో బోగీకి మూడు లారీల సరకును రూ.60 వేలకే రవాణా చేయవచ్చు. దీంతో ఈ రైళ్లకు డిమాండ్ ఉండేది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో పంట విస్తారంగా పండటంతో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో కిసాన్ రైళ్లకు డిమాండ్ తగ్గింది. స్థానిక మార్కెట్ కేంద్రంగా వాణిజ్యం జరుగుతోంది. గత ఏడాది ఈ సీజన్లో ఉల్లి రవాణా కోసమే 21 వరకు కిసాన్ రైళ్లను కేటాయించారు. కానీ ప్రస్తుతం వ్యాపారులు వీటి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. గత ఆరేళ్లలో ఉల్లి వ్యాపారానికి ఇంత భారీ కుదుపు ఇదేనని వ్యాపారులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి
[ 25-04-2024]
ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ ను దాఖలు చేశారు. -
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్