ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ
పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరి ఏడాదిన్నరకుపైగా కావస్తోంది. నెలలు గడిచిపోతున్నా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన నజరానాలకు అతీగతీ లేదు. పంచాయతీల ప్రథమ పౌరులు ప్రోత్సాహక నిధుల కోసం
ఉమ్మడి జిల్లాలో 99 పంచాయతీలు ఏకగ్రీవం
నెలలు అవుతున్నా అతీగతీ లేని నజరానాలు
ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే: పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరి ఏడాదిన్నరకుపైగా కావస్తోంది. నెలలు గడిచిపోతున్నా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన నజరానాలకు అతీగతీ లేదు. పంచాయతీల ప్రథమ పౌరులు ప్రోత్సాహక నిధుల కోసం ఆశగా ఎదురుచూసే కొద్దీ వారికి నిరాశే ఎదురవుతోంది.
ఉమ్మడి జిల్లాలో 892 గ్రామపంచాయతీలు, 9,660 వార్డు స్థానాలకు ఎన్నికల ప్రకటన జారీ చేయగా.. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవాలను మినహాయించగా మొత్తం 793 గ్రామ పంచాయతీలు, 7,030 వార్డు స్థానాలకు సంబంధించి పల్లె పోరు జరిగింది. పంచాయతీలు ఏకగ్రీవమైతే ప్రోత్సాహకం అందిస్తామని ముందుగా ప్రకటించిన ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఆయా కేటగిరీల వారీగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రోత్సాహం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు సమ్మతించడంతో నాలుగు డివిజన్ల పరిధిలో మొత్తం 99 పంచాయతీలు, 2,630 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు జిల్లాకు సుమారు రూ.6.5 కోట్లు రావాల్సి ఉంది. నెలలు గడిచినా ప్రభుత్వం ప్రకటించిన నజరానాలు అందలేదు. ప్రోత్సాహక నిధులందక.. పంచాయతీల్లో డబ్బులు లేక పాలకులు సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకెన్నాళ్లీ నిరీక్షణ అంటూ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుంటుపడుతున్న అభివృద్ధి.. ఏకగ్రీవాల ప్రోత్సాహకాలకు సంబంధించి జిల్లాకు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఏకగ్రీవ పంచాయతీల్లో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాలన్నా నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రోత్సాహక నిధులొస్తే పారిశుద్ధ్యం, తాగునీరు, అంతర్గత రోడ్ల అభివృద్ధి తదితర పనులు చేపడతామని సర్పంచులు చెబుతున్నారు. దీనికితోడు 14, 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో సర్పంచులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
నిధులు రాగానే సర్దుబాటు చేస్తాం.. జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో నిధులు మంజూరుకానున్నాయి. అవి వచ్చిన వెంటనే ఆయా పంచాయతీల ఖాతాల్లోకి సర్దుబాటు చేస్తాం. - ఎన్.బాలాజీ, జిల్లా పంచాయతీ అధికారిణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు