గోరుముద్దకూ తిప్పలే!
పెరిగిన ధరలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండి వడ్డిస్తున్న గోరుముద్దపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలకు సమాంతరంగా నిర్వాహకులకు చెల్లించే ధరలను ప్రభుత్వం పెంచకపోవడం సమస్యగా మారింది.
పెరిగిన ధరలతో నిర్వాహకుల కష్టాలు
మధ్యాహ్న భోజనంపై తీవ్ర ప్రభావం
పాలకొల్లు, పెనుగొండ గ్రామీణ, న్యూస్టుడే: పెరిగిన ధరలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండి వడ్డిస్తున్న గోరుముద్దపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలకు సమాంతరంగా నిర్వాహకులకు చెల్లించే ధరలను ప్రభుత్వం పెంచకపోవడం సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 75శాతం మంది మధ్యాహ్న భోజనంపై ఆధారపడి ఉన్నారు. వీరందరికీ నిత్యం నాణ్యమైన భోజనం అందించడం నిర్వాహకులకు కష్టమవుతోంది.
అయినా తప్పని భారం
ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో రూ.5.40, ఉన్నత పాఠశాలలో రూ.7.85 చొప్పున ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్నారు. 2019లో మెనూ మార్చిన ప్రభుత్వం బిల్లులు పెంపులో మార్పు చేయలేదు. ఇటీవల కొంత పెంచినా.. మార్కెట్లో వంట నూనెల ధరలు, గ్యాస్ ధరలు రెండు రెట్లు పెరిగాయి. అధిక వర్షాలు, వరదల పుణ్యమాని కూరగాయల ధరలు మండుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో బిల్లుల్లో విద్యార్థికి మరో రూపాయి అదనంగా పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించినా ఉత్తర్వులు నేటికీ విడుదల కాలేదు. దీనిపై డీఈవో వెంకటరమణను ‘న్యూస్టుడే’ సంప్రదించగా బిల్లులు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయని ఈ నెల నుంచి పెరిగిన ధరలతో నిర్వాహకులకు బిల్లులు విడుదల చేస్తామన్నారు.
* యలమంచిలి నంబర్ వన్ పాఠశాలలో 135 మంది విద్యార్థులున్నారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు జులై నెలలో ఇక్కడ వంట నిమిత్తం సుమారు రూ.19 వేలు వెచ్చించారు. ఇందుకు వారికి ఆగస్టులో మంజూరైన బిల్లు రూ.13,100. అంటే రూ.6 వేల వరకు నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని వారెలా భర్తీ చేసుకోవాలంటే సమాధానం లేదు. ఏదో ఒక నెల నష్టం వస్తే సరేగాని ప్రతినెలా వేలల్లో నష్టం అంటే ఎలా భరించాలని నిర్వాహకులు వాపోతున్నారు. వండిన దానిలో ఏదైనా మిగిలితే తాము తినడం తప్ప అంతకు మించి మరేం చేయలేని దయనీయ పరిస్థితి వారిది.
* పెనుగొండ పరిధిలోని ఆర్.తోట ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులున్నారు. వీరందరికి ఒక్కరే నిత్యం వండి వడ్డిస్తున్నారు. చాలీచాలని బిల్లులతో నెలకు రూ.2 వేలు మాత్రమే జీతం వస్తున్న తరుణంలో కొత్తవారు రావడానికి కూడా ఆసక్తి చూపడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?