బాలల మేధస్సుకు పరీక్ష
బాలల మేధస్సుకు పదును పెట్టేందుకు ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక సలహా మండలి (ఆప్కాస్ట్), భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా ‘కౌశల్-2022’ పేరిట సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రోత్సాహకాలకు ప్రకటన
గోడపత్రాలను విడుదల చేస్తున్న డీఈవో గంగాభవాని తదితరులు
ఏలూరు విద్యా విభాగం, న్యూస్టుడే: బాలల మేధస్సుకు పదును పెట్టేందుకు ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక సలహా మండలి (ఆప్కాస్ట్), భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా ‘కౌశల్-2022’ పేరిట సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను వెలికి తీసి వారికి తగిన ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులు పోటీలకు అర్హులు. క్విజ్, పోస్టర్ ప్రజెంటేషన్లు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.
పేర్ల నమోదు ఇలా: పోటీల్లో పాల్గొనదలిచిన విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా ఉపాధ్యాయుల సాయంతో పాఠశాల నుంచి పేర్లు నమోదు చేసుకోవచ్చు. పేర్ల నమోదుకు అక్టోబరు 15వ తేదీ వరకు గడువు విధించారు.www.bvmap.org వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి.
బహుమతులు ఇలా: కౌశల్ క్విజ్ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచే వారికి రూ.7,500, రూ.6 వేలు, రూ.4,500 నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచే వారికి రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.9 వేల నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు ఇస్తారు. రాష్ట్ర స్థాయి విజేతలకు గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.
పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలకు..: పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచే వారికి రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.1,000 చొప్పున నగదు బహుమతులు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచే వారికి రూ.7,500, రూ.5 వేలు, రూ.3 వేల చొప్పున ఇస్తారు.
విద్యార్థులకు మంచి అవకాశం
విద్యార్థులు తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం. శాస్త్రసాంకేతిక రంగంలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడం, ఆ రంగంలో ప్రోత్సహించడానికి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటాయి. పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.- ఎస్.వెంకటేశ్వరరావు, కౌశల్ ఏలూరు జిల్లా సమన్వయకర్త
అర్హత: క్విజ్ పోటీలకు బృందం ఎంపిక కోసం 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్లో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. పాఠశాల స్థాయిలో బృందంగా ఏర్పడే విద్యార్థులు ప్రతిభ కనబరిస్తే జిల్లా స్థాయికి ఎంపికవుతారు. అత్యధిక మార్కుల ప్రాతిపదికన జిల్లా స్థాయిలో గరిష్ఠంగా 36 బృందాలను ఎంపిక చేస్తారు. గణితం, సైన్స్తో పాటు విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయుల కృషి అనే అంశంపై క్విజ్ పోటీలు నిర్వహిస్తారు.
పోస్టర్ ప్రజెంటేషన్: 8, 9 తరగతుల విద్యార్థులకు ఈ పోటీ నిర్వహిస్తారు. ఒక పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకే అవకాశం కల్పిస్తారు. జీవ వైవిధ్య సంరక్షణ, జల సంరక్షణ, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై పేపర్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వాతంత్య్ర అమృత్ మహోత్సవాల పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలకు సంబంధించి ప్రతి పాఠశాల నుంచి ఒకటి మాత్రమే అనుమతిస్తారు.
పోటీలు ఎప్పుడంటే: ప్రాథమిక స్థాయి పరీక్షను ఆన్లైన్లో నవంబరు 2, 3 తేదీల్లో నిర్వహిస్తారు. అదే నెల 26న జిల్లా, డిసెంబరు 9న రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు