డిజిటలైజేషన్కు శ్రీకారం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పాత దస్తావేజుల డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టింది.ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కంప్యూటర్ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తాయి.
చురుగ్గా దస్త్రాల స్కానింగ్ ప్రక్రియ
చింతలపూడిలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయం
చింతలపూడి, న్యూస్టుడే: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పాత దస్తావేజుల డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టింది.ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కంప్యూటర్ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం 1999 తర్వాత జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ సమాచారం ఆన్లైన్లో లభ్యమవుతోంది. అంతకు క్రితం రిజిస్ట్రేషన్ వివరాలకు మాన్యువల్ రికార్డులే దిక్కు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న మాన్యువల్ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదు.రికార్డులకు చెదలు పట్టడం, పేజీలు చెరిగిపోవటంతో విలువైన సమాచారం చేజారిపోతుంది. దీన్ని అధిగమించడానికి డిజిటలైజేషన్ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ప్రజలు కోరే ఏ రిజిస్ట్రేషన్ సమాచారమైనా క్షణాల్లో అందించటానికి వీలవుతుంది.
రికార్డుల వివరాలు..
1850 నుంచి 1999 వరకు రిజిస్ట్రేషన్ సేవల్ని మాన్యువల్గా నిర్వహించేవారు.రిజిస్ట్రేషన్కు సంబంధించి పాత రికార్డులు వెతికి మాన్యువల్గా రాసి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇది చాలా కాలాతీతంతో కూడుకున్నది. ఆపై అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించటం కష్టంగా ఉండేది. బుక్-1, బుక్-3,బుక్-4 , ఇన్డెక్స్-1, ఇన్డెక్స్-2 పుస్తకాలు వాల్యూమ్స్ రూపంలో ఉన్నాయి. స్థిరాస్తుల విక్రయాలు, వీలునామా, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ , ఈసీ, నకళ్లు , ఇతర సమాచారం ఈ వాల్యూమ్స్లో ఉన్నాయి.
కంప్యూటర్ సేవలు అందుబాటులోకి..
* శాఖలో 1999 తర్వాత కంప్యూటీకరణ ప్రారంభమైంది.అప్పటినుంచే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను శాఖ అధికారులు పెద్ద వాల్యూమ్ పుస్తకంలో చేతితో రాసి భద్రపరిచేవారు. ఆ రికార్డుల్లో ఏదైనా పోతే అందులో ఉన్న ఆస్తుల వివరాలను ధ్రువీకరించుకోవడానికి మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో అధునాతన స్కానర్లతో డిజిటలైజేషన్ చేసి ఆ తర్వాతి సమాచారాన్ని కంప్యూటీకరణ చేయాలని ఆదేశించారు. జిల్లాలో 13సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డిజిటలైజేషన్ ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. జిల్లాలోని భీమడోలుతో పాటు కైకలూరులో ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా మిగిలిన అన్ని చోట్ల ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు కంప్యూటర్లు, స్కానర్లు ఆయా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిద్ధం చేశారు.
రోజూ 2 నుంచి 4 వాల్యూమ్లు
నిమిషానికి పది నుంచి 15 పేజీలను స్కాన్ చేసే పెద్ద స్కానర్లను ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 3నుంచి 5వరకు ఏర్పాటుచేశారు. దీనికి అనుసంధానంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. సగటున రోజుకు 2 నుంచి 4 వాల్యూమ్స్ పూర్తవుతున్నాయి. చింతలపూడి ఆర్వోలో 1850 నుంచి 1999 వరకు లెక్కిస్తే ఒక వెయ్యి నాలుగు వాల్యూమ్స్ ఉన్నాయి. ఆరు నెలల్లో వీటిని కంప్యూటీకరించనున్నారు. ఆ తర్వాత కొత్త విధానంలో ఈసీలను తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.