శోధించారు.. సాధించారు
అంతర్జాతీయ సదస్సులో తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన మహిళా శాస్త్రవేత్తలు పలు దేశాల పరిశోధకులతో పోటీపడి అవార్డులు దక్కించుకున్నారు. అనేక అంశాల్లో ప్రదర్శించిన పరిశోధనా పత్రాలకు గుర్తింపు లభించింది.
అంతర్జాతీయ వేదికపై ‘ఉద్యాన’ శాస్త్రవేత్తల ప్రతిభ
అవార్డులు అందుకుంటున్న శాస్త్రవేత్తలు
తాడేపల్లిగూడెం, న్యూస్టుడే : అంతర్జాతీయ సదస్సులో తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన మహిళా శాస్త్రవేత్తలు పలు దేశాల పరిశోధకులతో పోటీపడి అవార్డులు దక్కించుకున్నారు. అనేక అంశాల్లో ప్రదర్శించిన పరిశోధనా పత్రాలకు గుర్తింపు లభించింది. వ్యవసాయం, అటవీ, పర్యావరణ, ఆహార భద్ర]తపై అంతర్జాతీయ సదస్సు 17 నుంచి 19 వరకు నేపాల్ దేశంలో జరిగాయి. వ్యవసాయం అనుబంధ రంగాల్లో నూతన విధానాలు, వాతావరణ మార్పులు అనే అంశాలపై బహుముఖ పరిశోధనలు చేశారు. వాటికి సంబంధించిన పత్రాలను ఈ సదస్సు ముందుంచారు. ఉత్తమ పత్రాలుగా అవి నిలిచాయి.
మేలుజాతి పశు పోషణపై ప్రయోగాలు
పశువైద్య విభాగంలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నా. పాడి పశువుల్లో అత్యధిక పాల దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చో చర్చించాను. ప్రాంతీయంగా ఖనిజ లవణాల మిశ్రమాలను పశువులకు దాణా ఏ విధంగా వేయాలో వివరించా. కృషి విజ్ఞాన కేంద్రంలో పశు వైద్య విభాగంలో భారత పరిశోధనా మండలి తరఫున శాస్త్రవేత్తగా పని చేస్తున్నాను. ఇక్కడ మేలు జాతి పశు పోషణపై చేసిన పరిశోధనలకు ‘మహిళా ఉత్తమ యువ శాస్త్రవేత్త’గా అవార్డు దక్కింది. ఈ స్ఫూర్తితో మరిన్ని అవార్డులు రానున్న రోజుల్లో సాధిస్తాను. పరిశోధనా స్థాయిలోనే కొన్ని ఉన్నాయి. - డా.టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త
సేంద్రియ సేద్యంతో అధిక దిగుబడులు
సేంద్రియ విధానంలో ఉద్యాన పంటల సాగు పద్ధతులపై పరిశోధనలు చేశా. వాటిపై అంతర్జాతీయ సదస్సులో చర్చించాను. వీటిపైనే పరిశోధనా పత్రాలను కూడా అందించా. వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనలు ఉత్తమమైనవిగా గుర్తించి ‘యువ శాస్త్రవేత్త’గా అవార్డు అందుకున్నా. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచింది. -డా.వావిలాల దీప్తి, ఐసీఏఆర్ శాస్త్రవేత్త
మిద్దెతోటల పెంపకం.. పోషకాహార భద్రత
గృహావసరాలకు ఇంటిపైనే కూరగాయలను పెంచడం, పట్టణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత వంటి అంశాలపై పరిశోధనా పత్రాలను ప్రదర్శించాను. ప్రస్తుతం కేవీకేలో ప్రధాన శాస్త్రవేత్తగా, అధిపతిగా పని చేస్తున్నాను. మరిన్ని అంశాలు పరిశోధనా స్థాయిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చూపుతామన్న ఆత్మవిశ్వాసం ప్రస్తుతం సాధించిన అవార్డులు కల్పించాయి. మిద్దె తోటలను ఏ విధంగా పెంచాలి, వాటి ద్వారా ఒక ఇంటికి సరిపడా కూరగాయలు ఏ విధంగా సమకూర్చుకోవచ్చో వివరించాను. - డా. ఇ.కరుణశ్రీ, ప్రధాన శాస్త్రవేత్త
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో